ఏపీ దక్షిణ మండలి విద్యుత్
పంపిణీ సంస్థ డిస్కం పరిధిలో సుమారు ఎనిమిది జిల్లాలకి గాను గ్రామ , వార్డు
సచివాలయాలలో 5107జూనియర్ లైన్మెన్
గ్రేడ్ -2 పోస్టులకి అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులకి ఆహ్వానిస్తోంది. దీనిలో
అత్యధికంగా చిత్తూరు జిల్లాలకి సుమారు 684 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి
వివరాలలోకి వెళ్తే..
ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్స్ వారీగా ఖాళీలు పరిశీలిస్తే..
విజయవాడ – 637
గుంటూరు - 632
ఒంగోల్ - 641
నెల్లూరు - 577
తిరుపతి - 684
కడప - 611
కర్నూల్ - 658
అనంతపూర్ - 667
అర్హత : పదో తరగతితో పాటుగా సంభందిత ట్రేడ్ లో ఐటీఐ ఇంటర్ వొకేషనల్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకి పురుషులు మాత్రమే అర్హులు..
వయస్సు : 2019 ఆగస్టు సమయానికి 18 – 35 ఏళ్ళ మద్య వయసు ఉండాలి. SC, ST,BC అభ్యర్దులకి అయిదేళ్ళు గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ,పోల్ ఎక్కడం, మీటర్ రీడింగ్, సైక్లింగ్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక చేపడుతారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : రూ 200
దరఖాస్తు చివరితేదీ : ఆగస్టు 17, 2019
మరిన్ని వివరాలకై : www.apspdcl.in