చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా సరే , నిత్యం తమకున్న కారణాల వలన నేరుగా
విద్యాలయానికి వెళ్లి చదువుకోలేని వారు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారు ఇంట్లోనే ఉంటూ
విద్య నేర్చుకునే విధానాన్ని దూర విద్య అంటారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి ,ఉద్యోగాలు
చేస్తూ పై చదువుల పై ఆసక్తి కలిగిన వారికి, తక్కువ ఖర్చుతో చదువుకునే వారికి, ఈ దూర
విద్యా విధానం ఎంతో ఉపయోగపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో విద్య అందిస్తున్న
యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. అందులో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.
2019- 20 విద్యా సంవత్సరానికి గాను వివిధ పీజీ కోర్సుల్లో
ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఓయూ దూర విద్యా కేంద్రం
కోర్సుల వివరాలు
ఎంబీఏ, ఎంసిఏ
కాలవ్యవధి :
ఎంబీఏ - రెండేళ్లు
ఎంసీఏ - మూడేళ్లు
అర్హత :
ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలీజీల నుంచీ డిగ్రీ లేదా ఏదైనా గుర్తింపు పొందిన
కాలేజీల నుంచీ డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక విధానం :
ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు:
రూ 500
చివరి తేదీ ఆగస్టు :
31
2019
ప్రవేశ పరీక్ష తేదీ:
సెప్టెంబర్ 15 2019
మరిన్ని వివరాలకు వెబ్సైటు :