పసిడి రేటు మళ్లీ తగ్గింది. దీంతో బంగారం ధర పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు. మార్కెట్ లో బంగారం రేటు తగ్గితే వెండి ధర పైకి ఎగబాగింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వినయోగదారులకు ఇదోక ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతున్నా భారత మార్కెట్ లో ధర తగ్గడం గమనార్హం.

 

 

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పడిపోయింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ.30కి దిగింది. దీంతో ధర తగ్గడంతో రూ.51,170కి క్షీణించిందని వ్యాపారస్థులు పేర్కొన్నారు. 24 క్యారెట్ల బంగారంతో పాటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గిందని, దీని ధర 10 గ్రాములకు రూ.30 తగ్గుదలతో రూ.46,890కి చేరింది.దేశీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరగటం గమనార్హం. 

 

 

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధర పెరగడానికి ప్రధాన కారణమని, ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు తదితర అంశాల కారణాల వల్ల బంగారం ధరపై ప్రభావం చూపుతాయని వ్యాపారస్థులు పేర్కొన్నారు.

 

 

భారత మార్కెట్ లో తగ్గిన పసిడి అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగింది. ఔన్స్ కు 0.19 శాతం కదలడంతో బంగారం ధర ఔన్స్ కు 1805 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్ కు 0.55 శాతం పెరగుదలతో 19.15 డాలర్లకు చేరింది.

 

 

దేశ రాజధానిలో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 ఎగబాగింది. దీంతో ధర రూ.47,800 ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.100 పెరుగుదలతో రూ.49000లకు చేరింది. కేజీ వెండి ధర కూడా రూ.50 పెరగటంతో రూ.52,000గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: