అరటిపండు అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో ముఖ్యమైనది. ఆరోగ్యానికి అరటి పండు ఎంతో మేలు చేస్తుంది. నిపుణులు రోజూ మూడు అరటిపండ్లను తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావని చెబుతారు. రోజుకు మూడు అరటిపండ్లు తినే వారికి పొటాషియం స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరానికి ఎన్నో ఉపయోగపడే పోషకాలు కూడా అరటిపండ్లలో ఉన్నాయి. అరటిపండ్లు యాసిడిటీ సమస్యలను, గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 
అరటిపండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అరటిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అరటిలో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, సి, విటమిన్ బి6, పొటాషియం ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన పోషణను ఈ విటమిన్లు ఇస్తాయి. అరటిపండ్లు తింటే శరీర బరువు కూడా తగ్గుతుంది. అరటిపండు తినేవారిలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. మచ్చలున్న అరటిపండ్లలో క్యాన్సర్ తో పోరాడే కణాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో రాత్రి సమయంలో అరటిపండ్లను తినకూడదని తెలుస్తోంది. ఆయుర్వేదం ప్రకారం అరటిపండ్లను రాత్రి సమయంలో తింటే శ్వాసకోస సమస్యలు, జలుబు మరియు దగ్గు ఎక్కువగా వస్తాయి. దగ్గు, జలుబు, శ్వాసకోస సమస్యలతో బాధ పడే వారు అరటిపండ్లను తింటే మాత్రం మరిన్ని సమస్యలు తప్పవు.ఆయుర్వేద వైద్యులు చలికాలంలో రాత్రి సమయంలో తప్ప మిగతా సమయాల్లో అరటి పండ్లు తిన్నా ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: