కడుపు నొప్పిని నయం చేసే ఉత్తమ చిట్కాలు.
శొంఠి, ఉప్పు, మిరియాలు, వాము సమ భాగములుగా చేర్చి 5 గ్రాములు పరగడుపున నమిలి తిని కొంచం నిళ్ళు త్రాగితే కడుపు నెప్పి తగ్గుతుంది.
శొంఠి చూర్ణం 5 గ్రాములు, తగుమాత్రం చక్కెర కలిపి వేడి నీళ్ళతో తీసుకుంటే అజీర్ణం వల్ల వచ్చే కడుపునెప్పి, కడుపు వుబ్బరం తగ్గిపోతుంది.
పాల పండ్ల వల్ల వచ్చే అజీర్తికి, మజ్జిగ తాగితే పోతుంది.
పచ్చి పుదీనా ఆకులు ఏడు, ఏలక కాయ ఒకటి ఈ రెండు పదార్ధాలు ఒక తమలపాకులో పెట్టీ కిళ్ళీలాగా చుట్టి నోట్లో పెట్టుకుని నమిలి మింగిన తరువాత కొద్ది కొద్దిగా మంచినీళ్ళు తాగితే, ఆ మరుక్షణమే కడుపు నొప్పి కనుమరుగైపోతుంది.