ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ అధినేత శ్రీ.వై.యెస్. జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభినందనలు మరియు వై ఎస్ ఆర్ పార్టీ  శాసనసభ్యులు,పార్లమెంట్ సభ్యులు,వివిధ విభాగాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మరియు వైఎస్సార్సీపీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు.....
               "ఆనంద ప్రభాతం'
                ఐదు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు సమాధానం లభించే రోజు.
               ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో పెల్లుబుకుతున్న బాధను ఆనంద బిందువులుగా మార్చుకునే రోజు.
               మాట తప్పని వ్యక్తిత్వానికి పట్టాభిషేకం జరగనున్న రోజు.
               మడమతిప్పని రాజకీయానికి ప్రస్థానం ప్రారంభమయ్యే రోజు.
               వెలుగు కోసం ఎదురు చూసే వీరాభిమానులు ఆశలకు రెక్కలు తొడిగే రోజు.
               పల్లె లకు వేసవిలో పెద్ద పండుగ    మరోసారి వచ్చిన రోజు.
               ఓటు శక్తి అవిష్కరింపబడే రోజు.
               ఇష్టం తో వేసిన ఓటుకు అధికారం అందుతున్న రోజు.
                నవరత్నాలకు నడక మొదలయ్యే రోజు.
                కష్టజీవుల స్వేదం కి గౌరవం పెంచే రోజు.
                అమ్మ ఒడి ఆత్మీయత భావితరాలకు భద్రంగా అందించే రోజు.
                విలువలుతో కూడిన ప్రజా పాలనకు బీజం పడుతున్న రోజు.
                 విశ్వసనీయత అంటే ఏమిటో ప్రపంచానికి చూపే రోజు.
                 ఆడంబరాలకు దూరంగా జవాబుదారీ తనానికి దగ్గరగా.
                 అవమానాలే సోపానాలుగా విజయమే వారధిగా పేదల ప్రభుత్వానికి అడుగులు పడే రోజు.
                   ప్రజలే సారథులు ప్రజా ప్రతినిధులు సేవకులు అదే ఆశయం ప్రతి నిర్ణయంలో కనిపించే రోజు.
                   ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా ఇంకా ఎంతో ఉందని ఆత్మీయులు భావించే రోజు.
               ఆరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై యెస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసే రోజు.
               నేడే ఆ వైభవం కావాలి ఆంద్రప్రదేశ్ చరిత్రకు రాజన్న రాజ్యం తిరిగి ప్రాణం పోసుకునే రోజు.
              ఆనందాల ప్రభాతంతో ఐదు సంవత్సరాల ప్రజాప్రభుత్వ పునాదికి శ్రీకారం 
              అన్ని వర్గాల మన్ననలు పొంది సాగాలి ముందుకు అని ఆశిస్తూ దైవం తోడై నిలవాలని ప్రార్థిస్తూ.
              నిండు హృదయంతో ఆకాంక్షిస్తూ...
         
కే. ఎల్. ఎన్. ధనకుమార్
సామాజికవేత్త
వై ఎస్ ఆర్ సీ పి మండల ఫ్లోర్ లీడర్
పేరంపేట ఎంపీటీసీ
జంగారెడ్డిగూడెం మండలం
పశ్చిమగోదావరి జిల్లా

(మే 30, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా   వై .యెస్ జగన్మోహన్ రెడ్డి  గారు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా   వై యెస్ ఆర్ అభిమానుల గుండె చప్పుడు)


మరింత సమాచారం తెలుసుకోండి: