నేటి యువత ఫేస్‌బుక్,వాట్సాప్ చాటింగ్‌ల‌తో నిద్రను దూరం చేసుకుంటున్నారు. తద్వారా రోగాల భారిన పడుతున్నారు. చాలా మందికి నిద్ర విషయంలో క్లారీటి ఉండదు.. రోజులో ఎంత సేపు నిద్రపోవాలి.. శరీరానికి ఎంత వరకు విశ్రాంతి అవసరం అనేది కన్ఫుజన్ గా ఉంటుంది.. కొంత మంది రోజూ అంతా నిద్రపోతే, మరికొంత మంది వేళాపాళా లేకుండా నిద్రిస్తుంటారు. అయితే నిజానికి ఎన్ని గంటలు నిద్రపోవాలి..? మనిషి శరీరానికి ఎన్ని గంటల నిద్రసరిపోతుంది.. ఎన్ని గంటలు నిద్రపోతే మనిషి అరోగ్యంగా ఉంటారో ఓసారి తెలుసుకుందాం.


 
నిద్ర అవ‌స‌రం కన్నా తక్కువైనా... ఎక్కువైనా ప్రమాదమేనని శాస్రవేత్తలు చెబుతున్నారు. రోజులో మనిషికి ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర పోవాలిని వైద్యులు చెబుతున్నారు. సరి అయిన నిద్రలేకపోతే మనిషి అధిక బరువు పెరుగుతారు అని వైద్యులు చెప్తున్నారు. నిద్రలేమి వల్ల గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అమెరాకాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన భారతీయ శాస్త్రవేత్త అనూప్ శంకర్ బృందం నిద్రపై జరిపిన పరిశోధనలు జరిపారు.

 

ఈ పరిశోధనలలో 30,000 మంది పెద్దవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. రోజుకి ఏడు గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు.. ఐదు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు తెలిపారు.. తక్కువ సమయం నిద్రించేవారిలో గుండెపోటు, పక్షవాతం,మధుమేహం,అధికరక్తపోటు వంటి జబ్బులు  భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలింది. ఈ లెక్క‌న రోజులో ఎక్కువ‌, త‌క్కువ కాకుండా ఏడు గంటలు పడుకుంటే ఆరోగ్యంగా  ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: