శప్తభూమి అంటే శపించబడిన నేల అని అర్థం. ఎంతో ఘన చరిత్ర ఉన్న రాయల సీమ ఎలా శాపగ్రస్తమైందో రచయిత నారాయణ స్వామి అద్భుతంగా అక్షరబద్దం చేశారు. శప్తభూమి నవలను పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్రం ప్రకటించింది.

తెలుగు సాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఓ తెలుగు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘శప్తభూమి’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. రాయలసీమ చరిత్రను తెలిపే శప్తభూమి నవలను పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్రం ప్రకటించింది.


2019 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 23 భాషలకు చెందిన రచయితలను పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగులో బండి నారాయణస్వామి రాసిన నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. శప్తభూమి అంటే శపించబడిన నేల అని అర్థం. ఎంతో ఘన చరిత్ర ఉన్న రాయల సీమ ఎలా శాపగ్రస్తమైందో రచయిత నారాయణ స్వామి అద్భుతంగా అక్షరబద్దం చేశారు.18వ శతాబ్దం నాటి సంఘటల ఆధారంగా శప్తభూమి నవలను రచించారు.


నారాయణస్వామి అనంతపురం జిల్లాలో 1952 జూన్ 3 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన రాసిన మొదటి కథ ‘పరుగు’ ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైంది.


వానరాలె, నడక, తెల్లదయ్యం కథలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మొత్తం నలభై వరకూ కథలు రాశారు. వీరగల్లు కథాసంపుటి, గద్దలాడ్తాండాయి, మీరాజ్యం మీరేలండి, రెండు కలలదేశం తదితర నవలలు రాశారు. శప్తభూమి నవల తానా పోటీల్లో రెండు లక్షల రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది. రాయలసీమ ఆనవాళ్లను తన కథలో ఇనుమడింపజేసిన రచయితను పలువురు అభినందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: