ప్రతిరోజు నీటిని తగినంత మోతాదులో త్రాగడం వల్ల మనకు అనేకరకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం ఇప్పటికే నిరూపింప పడ్డ విషయం తెలిసిందే. అయితే ప్రతిరోజు ఉదయం పరగడుపునే కప్పు వేడి నీళ్ళు త్రాగితే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ప్రతి వ్యక్తి ఈ అలవాటును ఖచ్చితంగా అనుసరిస్తాడు.
ఇలాంటి అలవాటు వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడటమే కాకుండా శరీరంలో ఉన్న మలినాలు, చెడు పదార్థాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దీనివల్ల మలబద్దకం దూరమవుతుంది.
పైల్స్ ఉన్నవారికి వేడి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. వేడి నీటిని తాగితే పైల్స్ సమస్య తగ్గుతుంది. ఈ అలవాటు వల్ల కొవ్వు వేగంగా కరిగి బరువు తగ్గడమే కాకుండా శరీరంలో అవయవాలు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీలు పనితీరు పెంచడంలో ఈ అలవాటు ఎంతో మేలు చేస్తుంది.
ఈ అలవాటు వల్ల మన శరీర మెటబాలిజం వేగవంతమవుతుంది. ఇది క్యాలరీలను ఖర్చు చేసేందుకు ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాస కోశ సమస్యలు ఈ వేడి నీరు త్రాగడం వల్ల దూరమవుతాయి. అందువల్ల ఈ అలవాటు క్రమ పద్ధతిలో చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని వేడి నీరు త్రాగడం అన్ని విధాల మంచిది అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి..