ఒక  గురువు  చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు.  అటుగా వెళుతున్న  బాటసారి గురువు  చెబుతున్నది. వినీ దగ్గరకు వెళ్లి  తనకు మంత్రోప దేశం  ఇవ్వమని  అడిగాడు. గురువు  అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని తన బార్య  గర్భవతి అని చెప్పాడు. 


గురువు ఇలా అన్నాడు  గురు దక్షిణగా  నువ్వు నాకే మిస్తావు? అని అడిగాడు గురువు.  మీరు ఏది అడిగితే  అదే ఇస్తాను అన్నాడు.  సరే...నీ భార్యను అడిగి రా...తనకు పుట్టిన  బిడ్డలను  నాకు ఇవ్వ గలదా?  అలా చేస్తే నీకు మంత్రోప దేశం చేస్తాను.  వెళ్లి నీ భార్యను  అడిగి రా,  పిల్ల  పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. 


అతను వెంటనే  ఇంటికి  పరుగెత్తి  భార్యకు విషయం చెప్పి మన పిల్లలను  గురువుకు  ఇవ్వ గలవా ? అని అడిగాడు. అందుకు  ఆమె అలాగే  ఇచ్చేద్దాం.
మన పిల్లలు  గురువు వద్ద ఉంటే  మంచిదే కదా, అంటూ  ఒప్పు కుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు.  కొద్ది రోజులకీ ఆమె ప్రస వించింది. 
మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని  నెత్తుటి మడుగులో ఉండ గానే  తీసుకెళ్లి  గురువు  చేతిలో పెట్టారు. భార్య భర్తలు గురువు  ఆ పిల్ల వాడిని  తీసు కెళ్లి   గొయ్యి తీసి  అందులో పూడ్చేసాడు. 


తల్లి దండ్రులు బిత్తర పోయి  చూస్తు, చేసేది. ఏమి లేక  వెను తిరిగి వెళ్లి  పోయారు.  ఈ  విదంగా రెండో  పిల్ల వాడిని  కూడ  గొయ్యి లో  పూడ్చి పెట్టేసాడు.  
మూడో సారికీ  ఆవిడ ఒప్పు కోలేదు. ఇదేం గురువయ్యా ?  నాకు నచ్చలేదు. నా కొడుకును  ఇవ్వను. కాక ఇవ్వను అంటూ  మొండి కేసింది.  అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు.  గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి  ఇలా... అన్నాడు. అమ్మ  నీ బిడ్డను ఇవ్వ నన్నావు కదా,  ఇప్పుడు  నీ బిడ్డను  నే,నేమి  చేయను. కాని ఒక్క  సారి  బిడ్డను...నా చేతి కిచ్చి  నా వెంట రండి. మీ బిడ్డను నే,నేమి చేయను. మళ్లి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు. 
సరే ననీ  బిడ్డను తీసు కొనీ  గురువు  వెంట బయలు దేరారు వారిరువురు. 
 
గురువు  వీళ్లిద్దరినీ  ఇంతకు ముందు  గొయ్యి తీసి పెట్టిన చోటికి టగీసు కెళ్లాడు. ఆ  రెండు గొయ్యిల  మద్యన  తెల్లని గుడ్డ పరిచి...ఈ  పిల్ల వాడిని  వాటి మద్యలో  పడుకో బెట్టి  చేతి లోకి  నీళ్ళు  తీసుకొనీ  మంత్రించి...ఆ ముగ్గురు పిల్లల  మీద చల్లాడు.  తల్లీ దండ్రులను  కొంచెం  దూరంలో  నిలబెట్టి...
ఆ  గొయ్యిలో నుండి  వస్తున్న  శబ్దాలను  విన మన్నాడు. గొయ్యి లో నుండి  మొదటి పిల్లవాడు  రెండవ వాడిని  అడుగుతున్నాడు.   ఒరేయ్  వీళ్ళకు  కొడుకుగ  పుట్టావు. కదా  దేని  కోసం  పుట్టావు.  వీళ్ళకి  నీకు  ఏమిటి సంబంధం  అని అడిగాడు. 

రెండో వాడు ఇలా చెబుతున్నాడు.   గత జన్మలో  వీడు  బాకి పడ్డాడు. నాకు  డబ్బులు ఇవ్వ కుండానే  పోయాడు. అందుకనీ  వీడికి కొడుకునై  పుట్టి  అంది నంత లాగేసు కుందామని  వచ్చాను.  మరీ నువ్వేందు కొచ్చావు   అని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా...నేను కూడా అందుకే  వచ్చాను.
వీడికి  కొడుకునై పుట్టి  దొరికి  నంత  దోచు కొని వదిలేసి వెళ దామని  వచ్చాను . కానీ వీడు మనల్ని  గురువు చేతి లో పడ వేసాడు.  


ఇంకే ముంది? వాడు మనకు పడిన  బాకీలన్నీ  గురువు  తెగ్గొట్టేసాడు. ఇప్పుడు  వాడికి  మనకి  రుణ బంధం తెగిపోయింది. అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు.  ఈ  ఇద్దరూ  కలిసి  బ్రతికి  ఉన్న మూడో వాడిని  అడిగారు. ఒరేయ్   నువ్వెందు కొచ్చావురా అని?  అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు  కొడుకులు  బిడ్డలు  ఉండికూడ  దిక్కు లేకుండా పడిఉంటే  వీడు నన్ను  చేరదీసి అన్నం పెట్టీ ఆద రించాడు. 
నేను పోయే వరకు నన్ను  పోషించాడు. 


అందుకే...ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రు లిద్దరినీ  వాళ్ళు బ్రతికి నంత  కాలం అన్నం పెట్టి వాళ్లను  సంతోషంగా  ఉంచి ప్రశాంత మైన  జీవితాన్ని  వాళ్ళకు  ఇచ్చి  వారి రుణం  తీర్చు కుందామని  వారికి కొడుకునై పుట్టాను.  మీరు ఆయన్ని  పీడించాలని  వచ్చారు.  గనుక గురువు  మిమ్మల్ని గొయ్యి లో పాత పెట్టాడు.  నేను  అలా కాదు గనుక  నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు.  ఈ  ముగ్గురు  మాట్లాడు కున్న  మాటలు ఈ  తల్లి తండ్రులు విన్నారు.  గురువు పాదాల మీద పడి క్షమించ మని  వేడు కున్నారు. కాబట్టీ  గురువు లేని  పూజ  గుడ్డి పూజ అని అర్దం. 


ఆత్మ జ్ఞానము తెలిసిన  గురువును  పట్టు కుంటే రుణాను బంధాలే  కాదు,  జన్మ రాహిత్యమే  జరుగు తుంది. ఈ  జన్మ లోనే మోక్షం లభిస్తుంది...
మోక్ష మంటే  చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ  చాలా మంది అను కుంటారు  కాని అది కాదు.మోక్షం అంటే బ్రతి కుండగానే  ఆత్మ జ్జానాన్ని  పొందటం...దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు.. ఎక్కడ ఉన్నాడు...ఏం చేస్తున్నాడు. 


ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది.  నే,నె'వరిని. ఎక్కడ నుండి  వచ్చాను. మళ్లి ఎక్కడికి వెళతాను. అసలు  మాయ అంటే ఏమిటి??? ఇలా ఎన్నో సృష్టి రహస్యలు  బ్రతి కుండ గానే  తెలిసి పోతాయి.ఇదే మోక్షం మరు జన్మకి రా కుండా భగవంతుడు.తన రూపాన్ని ఇచ్చి తానుగా  మార్చు కుంటాడు.
ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు.

ఇది కధే ఐనా:- వాస్తవం
గురువుద్వారానే కర్మ పరిష్కారం కలుగుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: