సినిమా ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హసన్ వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదట్టలో కాస్త తడబడ్డా ఈ మద్య వస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ సినిమాలే.. ముఖ్యంగా మహేష్ బాబు తో నటించిన శ్రీమంతుడు చిత్రంతో ఈ అమ్మడి స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది..అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఓపక్క తమిళంలో ఆఫర్లు ... మరోపక్క తెలుగులో ఆఫర్లు.ఈ క్రమంలో తన పారితోషికాన్ని ఈ చిన్నది బాగా పెంచేసిందని వార్తలు వస్తున్నాయి.


గతంలో శృతి హాసన్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నే కాక బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది కానీ అక్కడ అంతగా రాణించలేక పోయింది. దీంతో ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీ పై కన్నేసింది. రవితేజతో బలుపు, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య, రాంచరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ తో రేసు గుర్రం  చిత్రాలతో మంచి ఊపులో ఉన్న ఈ అమ్మడికి మహేష్ బాబుతో శ్రీమంతుడు బాగా కలిసి వచ్చింది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అన్న ఈ అమ్మడిని ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు. అంతే కాదు తమిళంలో అజిత్ సరసన ‘వేదళం’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అప్పుడే 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ఈ అమ్మడికి తెలుగు , తమిళ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగిపోయింది.

శ్రీమంతుడు పోస్టర్


నాగచైతన్యతో కలసి 'మజ్ను' సినిమాలో నటించడానికి కోటిన్నర తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమా కోసం ఆమెను అప్రోచ్ అయిన నిర్మాతలకు ముందుగా డేట్స్ ఖాళీ లేవని చెప్పిందనీ, అయితే అడ్జస్ట్ చేస్తే ఎక్కువైనా ఇస్తామని వారు చెప్పడంతో కోటిన్నర డిమాండ్ చేసిందని అంటున్నారు.  ఏది ఏమైనా ఈ మద్య శృతి హాసన్ గోల్డెన్ లెగ్ అంటున్నారు..అదే ఊపు లో ఈ అమ్మడి పారితోషికం కూడా విపరీతంగా పెంచేసినా నిర్మాతలు మాత్రం ఆమె వైపే మొగ్గు చూపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: