సంక్రాంతి రేసుకు ‘సోగ్గాడే చిన్ని నాయన’ గా తయారై వస్తున్న నాగార్జున సినిమాకు సంబంధించి ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినిమాలో నాగార్జున మరదలుగా నటిస్తున్న అనసూయకు సంబంధించిన ఒకన్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘జబర్దస్త్’ కామెడీ షో తరువాత సినిమాల పై కన్నేసిన అనసూయ ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్ సినిమాలో నటించకపోయినా ఆమెకు ఈసినిమాకు సంబంధించి ఇచ్చిన పారితోషిక వార్తలు చాలామంది మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 

దీనికి కారణం అనసూయ ఈసినిమాలో కేవలం 10 రోజుల పాటు నటించినందుకు ఆమెకు 40 లక్షల పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. అయితే ఈసినిమాను నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. సినిమా బడ్జెట్ విషయంలో చాల జాగ్రత్తగా ఉండే నాగార్జున అనసూయకు ఈ స్థాయిలో పారితోషికం ఇచ్చాడు అంటే అది నమ్మలేని విషయం అని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ స్థాయిలో నాగ్ అనసూయకు పారితోషికం ఇచ్చి ఉంటే ఇదే సినిమాలో హీరోయిన్స్ గా నటించిన రమ్యకృష్ణ లావణ్య త్రిపాఠీలకు నాగ్ ఇంకెంత భారీ పారితోషికాలు ఇచ్చి ఉంటాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈసినిమాలో మరదలుగా హాట్ లుక్ తో నటించిన అనసూయకు ఎంత పారితోషికం అందింది అన్నది సీక్రెట్ అయినా ప్రస్తుతం అనసూయ పారితోషిక వార్తలు మాత్రం ఇండస్ట్రీ లో హాట్ న్యూస్ గా మారిపోయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: