అనసూయ భరద్వాజ్ ఈమె పేరు వింటే చాలు  అభిమానులు క్రేజ్ తో ఊగి పోతున్నారు. ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో ఎవరికీ లేనంత క్రేజ్ అనసూయకు ఉంది అన్నది వాస్తవం. తనకు ఉన్న క్రేజ్ ను కాసులుగా మార్చు కోవాలని సినిమాల పై కన్ను వేసి టాప్ సినిమా సెలెబ్రెటీగా మారిపోదామని ప్రయత్నాలు చేస్తోంది అనసూయ. 

ఈమధ్యనే నాగార్జునకు మరదలుగా నటించి పేరు తెచ్చుకున్న అనసూయ   ప్రస్తుతం ‘క్షణం’ మూవీలో జయ భరద్వాజ్ గా కాప్ పాత్రలో నటిస్తోంది. నూతన దర్శకుడు రవికాంత్ డైరెక్షన్ లో అడవి శేష్ ఆదా శర్మలతో కలిసి నటిస్తోంది. ఈసినిమాను కేవలం కోటి రూపాయలతో నిర్మించిన పివిపి నిర్మాణ సంస్థ ఈసినిమా ప్రమోషన్ కోసం 50 లక్షలు ఖర్చు పెడుతోంది. ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరగడానికి అనసూయ చేత ప్రమోట్ చేయిస్తున్నారు. 

ఈ సందర్భంలో  మీడియాతో మాట్లాడుతూ అనసూయ తన కెరియర్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు  ఎంతమంది అభిమానులు ఉన్నారో, అంతేమంది శత్రువులు ఉన్నారు అంటూ ఆ విషయాలను పట్టించుకోను అని కామెంట్స్ చేసింది. అదేవిధంగా తనపై  రూమర్స్ చాలానే వస్తుంటాయి అని అంటూ  ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోతానని కానీ తన భర్త తన కుటుంబం తనను వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని కామెంట్ చేసింది అనసూయ. 

అయితే ఈ కామెంట్స్ కు కొంతమంది మీడియా ప్రతినిధులు షాక్ అయినట్లు టాక్. ఇప్పటి వరకు కేవలం బుల్లితెరకే పరిమితం అయిన అనసూయ క్రేజ్ ను చూసి ఆమె పై శత్రుత్వం పెంచుకునే శత్రువులు టాలీవుడ్ లో అంత ఖాళీగా ఎవరున్నారు అంటూ సెటైర్లు వేసుకున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా సినిమా స్టార్ గా మారుదామని అనసూయకు, రెష్మీకి జరుగుతున్న పోటీ నేపధ్యంలో వీరిద్దరూ వేర్వేరుగా నటిస్తున్న ‘క్షణం’, ‘గుంటూరు టాకీస్’ సినిమాలను ప్రమోట్ చేస్తూ బిజీగా కాలాన్ని గడిపేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: