‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత టాలీవుడ్ ఎంపరర్ గా మారిన పవన్ కళ్యాణ్ తో సినిమాలుతీయాలి అని ఎన్నో ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రయత్నించాయి. కొన్ని నిర్మాణ సంస్థల దగ్గర పవన్ ఎడ్వాన్స్ లు కూడ పుచ్చుకున్నాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే పవన్ ఆ టాప్ ప్రొడక్షన్ హోస్ లు వద్ద తీసుకున్న అడ్వాన్సులను తిరిగి ఇచ్చి వేస్తున్నాడు అన్న వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

పవన్ ఈ విధంగా ప్రవర్తించడానికి అతడి సన్నిహిత మిత్రులే కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. బయట వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ తనకు అత్యంత నమ్మకంగా ఉండే సన్నిహితులైన స్నేహితులకు అదేవిధంగా అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాతలతోనే సినిమాలు చేయాలని పవన్ ధృడ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ నిర్ణయంలో భాగంగానే పవన్ తనకు అత్యంత ఆత్మీయుడైన శరత్ మరార్ కోసం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈసినిమా విడుదల అయ్యాక పవన్ జూన్ నుండి తన డేట్స్ ను ప్రముఖ తమిళ నిర్మాత ఎ.యమ్. రత్నంకు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈనిర్మాత పవన్ తో ‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన తరువాత కోలీవుడ్ లో కొన్ని సినిమాలు తీసి తీవ్రంగా నష్టపోవడంతో ఎ.యమ్. రత్నం ఆర్ధికంగా బాగా చితికి పోయాడు అనే వార్తలు కూడ వచ్చాయి.

అయితే ఆతరువాత కోలీవుడ్ హీరో అజిత్ ఇచ్చిన సహకారంతో ఈనిర్మాత కొంత కుదుట పడ్డాడు. మళ్ళీ ఇతడికి పూర్వ వైభవం తీసుకురావడానికి పవన్ నిశ్చయించుకుని తన డేట్స్ ను ఎ.యమ్. రత్నంకు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు 2017 లోపు పవన్ నటించబోయే మరో రెండు, మూడు సినిమాలను కూడ నిర్మించే బాధ్యత తన స్నేహితులకే అప్పచేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లిస్టులో దర్శక రత్న దాసరి పేరు ఉందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: