‘సరైనోడు’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైన నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక హాట్ గాసిప్ ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆడియో సక్సస్ మీట్ ను కూడ జరుపుకున్న ఈ సినిమాకు ఇప్పుడు కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారు అన్న వార్తలు చాల మందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకూ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తరువాత ఈ సినిమా ఫైనల్ కాపీని చిరంజీవికి చూపించినట్లు టాక్. ఈ సినిమా చూసిన తరువాత చిరంజీవి చెప్పిన సూచనలతో ఈ సినిమాలోని రెండు సన్నివేశాలకు రెండు రోజుల రీ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారని  వార్తలు వస్తున్నాయి.  

ఈ సినిమా కథకు సంబంధించి కొన్ని సీన్లలో పంచ్ సీన్లు, కామెడీ టైమింగ్ ను మార్చి తీస్తే అది మరింత వర్కవుట్ అయ్యే ఛాన్సుందని చిరంజీవి సూచించడంతో ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఓ 2 రోజులు షూట్ చేసి వాటిని యాడ్ చేసి ప్రింటును అందరికీ పంపించేయడం మరీ పెద్ద కష్టమైన విషయం కాదు అన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. . 

ఈ వార్తలు ఇలా ఉండగా ‘సరైనోడు’ పాటల విజయోత్సవ సభలో అతిధిగా పాల్గొన్న చిరంజీవికి బోయపాటి ఒక కథను వినిపించినట్లు టాక్. ఈ కథ  నచ్చడం తో  ఈ సినిమాను తన 151వ సినిమాగా తీద్దామని అల్లు అరవింద్ కు చెప్పి బోయాపాటికి లైన్ క్లియర్ చేసాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. అయితే ‘సరైనోడు’ ఘన విజయం సాధిస్తేనే బోయపాటి కల నేరవేరు తుంది అన్నది ఓపెన్ సీక్రెట్. ఇది ఇలా ఉండగా సరైనోడు జూనియర్ నటించిన  “దమ్ము”సినిమాకు సీక్వెల్ గా ఉంటుంది అన్న వార్తలు ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లను కలవరపెడుతున్నట్లు టాక్.   


మరింత సమాచారం తెలుసుకోండి: