మొన్న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న మంచు విష్ణు ‘ఈడోరకం ఆడోరకం’ సినిమా మంచు ఫ్యామిలీని మంచి జోష్ లో ముంచి వేస్తే మోహన్ బాబుకు మటుకు ఒక తీపి బాధను మిగిల్చింది అంటూ స్వయంగా మోహన్ బాబు సెటైర్లు వేస్తున్నాడు. దీనికి కారణం మోహన్ బాబు నిన్న ఈ సినిమాను తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మల్టీ ప్లక్స్ ధియేటర్ లో ఆ సినిమాను చూడటానికి ఎంతో ప్రయత్నించినా తనకు టిక్కెట్లు దొరకకపోవడం షాక్ ఇచ్చింది అన్న కామెంట్స్ చేస్తున్నాడు.  

అయితే ఈ బాధ చాలా తియ్యగా ఉందని మోహన్ బాబు సంబర పడుతున్నాడు. అంతేకాదు అతి కష్టం మీద శనివారానికి కొన్ని టికెట్లు మాత్రం సంపాదించగలిగానని చెపుతున్నాడు. 

‘‘క్లీన్ సూపర్ హిట్ అంటే ఇదే మరి. ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాను జనాల మధ్య చూడాలని, వాళ్ల స్పందన చూడాలని అనుకున్నా. కానీ మల్టీప్లెక్సుల్లో ఈ రోజు టికెట్లు దొరకలేదు. నిర్మాత అనిల్ సుంకర  టికెట్ల కోసం అడుక్కోవాల్సి వచ్చింది. అతను కష్టపడి రేపటికి కొన్ని టికెట్లు సంపాదించాడు. కానీ నేను అడిగినన్ని టికెట్లు మాత్రం తెప్పించలేకపోయాడు. టికెట్లు అప్పటికే అమ్ముడైపోవడమే దీనికి కారణం. ‘ఈడోరకం ఆడోరకం’ టీం మొత్తానికి కంగ్రాట్స్. విష్ణు విషయంలో చాలా హ్యాపీగా ఉంది. నాగేశ్వరరెడ్డి తో అతడి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ అని మరోసారి రుజువైంది. ఇంకా చాలా రావాల్సి ఉంది’’ అంటూ మోహన్ బాబు తన ఆనందాన్ని తన ట్విటర్ లో పంచుకున్నాడు.

అనుకోని సైలెంట్ హిట్ గా ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలే షాక్ అవుతున్నట్లు టాక్. గత వారం విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఎదో విధంగా 48 కోట్లు కలెక్ట్ చేఇన తరువాత ఈ వారంలో వరస సెలవులు రావడంతో ఎంతో కొంత ఈ సినిమా లాస్ లు కవర్ అవుతాయి అని భావించిన ‘సర్దార్’ బయ్యర్లకు మంచు విష్ణు ఊహించని షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. చాల కాలం తరువాత మంచు ఫ్యామిలీ నిజమైన సక్సస్ ను ఎంజాయ్ చేస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: