ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలు బాగానే వస్తున్నాయి. గతంలో ఇలాంటి సినిమాలు వస్తే హీరోల ఇమేజ్ దెబ్బ తింటుందని కాస్త దూరంగా ఉన్నా ఇప్పుడు ఆ ట్రెండ్ కి స్వస్తి చెప్పారనిపిస్తుంది. ఆ మద్య విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ మరోసారి విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు అద్భుతమైన విజయం సాధించాయి.  ఈ మద్య సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపించింది. అదే మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రాబోతుందని...అయితే అదంతా ఉత్తిదే అంటూ ఇప్పుడు కొత్త వార్త చక్కర్లుకొడుతుంది.  

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కిస్తే ఎలా ఉంటుందని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి తట్టిందని.. ఆ ఇద్దరితో కలిసి ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో పుకారు షికారు చేస్తోంది. టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిపోతుందనే ఉద్దేశంతో బోయపాటి వారితో మల్టీస్టారర్ తీయాలనే ఆలోచన చేసినట్లు టాక్ వినిపించింది.  ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ చిత్రం తీయబోతున్నట్లు అందులో ఈ ఇద్దరు హీరోలు సందడి చేయబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి.

అయితే అవన్నీ అవాస్తవాలని ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది.బోయపాటి సన్నిహితులు కూడా ఈ వార్తని ఖండించారు. అసలు అలాంటి ఆలోచన అతను చేయలేదని చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేయనున్న ప్రాజెక్ట్‌పైనే బోయపాటి దృష్టి సారించాడని స్పష్టం చేస్తున్నారు. అసలు ఇలాంటి రూమర్లు ఎక్కడినుంచి పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని వారంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: