తెలుగు ఇండస్ట్రీలో సినిమా హీరోల వారసులు వస్తున్న తరుణంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు మేనళ్లుడు సందీప్ కిషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఇక ఇండస్ట్రీలో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు పడ్డ కృష్ణవంశి దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో సందీప్ కిషన్ నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో సందీప్ కిషన్ తలకు బలమైనగాయుం అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సందీప్ కిషన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  

ప్రస్తుతం చికిత్స పొందుతున్న సందీప్‌ కిషన్‌కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.  ఇటీవల విడుదలైన 'ఒక అమ్మాయి తప్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. కృష్ణ వంశీ లాంటి స్టార్ దర్శకుడితో చేస్తుండటంతో తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు.  ఈ చిత్రంలో సుదీప్, ప్రకాష్ రాజ్ లు కీలకపాత్రలు పోషించనుండగా.. కాజల్ ఓ ప్రత్యేక పాత్ర పోషించనుంది.

ఇకపోతే సందీప్ కిషన్ ఈ సినిమాలో ఓ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. పోలీస్ అవ్వడమే ధ్యేయంగా ఎదిగిన ఓ కుర్రాడు మొదట కానిస్టేబుల్ గా తన కెరీర్ ను ఆరంభించి.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది “నక్షత్రం” చిత్ర కథాంశం అని తెలుస్తోంది!


మరింత సమాచారం తెలుసుకోండి: