రచయితగా తన కెరియర్ మొదలు పెట్టి దర్శకుడు కావడమే తన జీవిత ధ్యేయంగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్న వక్కంతం వంశీకి మళ్ళీ ఇప్పుడు ఒక అనుకోని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ నుండి తేరుకుని తిరిగి దర్శకుడుగా నిలదొక్కుకోవడానికి అల్లు అర్జున్ ను బాసటగా చేసుకుని ఒక మూవీ బన్నీతో వక్కంతం ఫైనల్ చేయించుకున్న విషయం తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఆ ఆశలకు దర్శకుడు వినాయక్ అనుకోని షాక్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. ఒక పవర్ ఫుల్ స్టోరీని వంశీ బన్నీ కోసం తయారుచేయడమే కాకుండా అల్లు అర్జున్ కు కూడ ఆ కథతో ఇంప్రెస్ చేశాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఈమూవీ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే వినాయక్ దెబ్బకు ఈప్రాజెక్ట్ ఆగింది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న వినాయక్ ఇప్పుడు బన్నీ కోసం ఓ స్టోరీ తయారుచేస్తున్నాడట. ఇన్నాళ్లూ ఈ కథను సాయిధరమ్ తేజ్ తో తీయాలి అనుకున్న వినాయక్ దృష్టి ప్రస్తుతం బన్నీ పై పడింది అని అంటున్నారు. 

దీనితోడు లేటెస్ట్ గా ‘ఖైదీ’ సినిమాకు అద్భుతమైన కలక్షన్స్ వచ్చిన నేపధ్యంలో వినాయక్ క్రేజ్ మళ్ళీ కొంత మొదలైంది. దీనికితోడు గతంలో వినాయక్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘బన్నీ’ ‘బద్రినాథ్’ సినిమాలొచ్చాయి. ‘బద్రీనాథ్’ డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయలేదు. 

అయితే వినాయక్ కు మెగా కుటుంబంతో అదేవిధంగా అరవింద్ తో ఉన్న సాన్నిహిత్యంతో బన్నీ కోసం ఒక వినోదాత్మక యాక్షన్ చిత్రాన్ని చేసే అవకాసం ఇప్పించ వలసిందిగా వినాయక్ అల్లు కాంపౌండ్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్. దీనితో వక్కంతం కంటే వినాయక్ తోనే తన తదుపరి సినిమా ఉంటే మంచిది కదా అన్న ఉద్దేశ్యంలో ప్రస్తుతం బన్నీ ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే వక్కంతంకు వినాయక్ అడ్డంకుగా మారబోతున్నాడనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: