బుల్లితెర యాంకర్ లాస్యను రాజ్ తరుణ్ పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటూ ఆమధ్య మీడియాలో తెగ గాసిప్పులు వచ్చాయి. వాటిని రాజ్ తరుణ్ లాస్యలు ఇద్దరూ ఖండించారు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక మీడియా సంస్థకు లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తిరిగి లాస్య ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు ఈ యంగ్ హీరో.

తాను లాస్యను ‘కుమారి 21ఎఫ్’ మూవీ ఆడియో కార్యక్రమంలో తప్ప తాను మరెక్కడా ఆమెను చూడటం కలవడం జరగలేదని కేవలం ఆ కార్యక్రమం జరిగినరోజు తీసిన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేసిన విషయాన్ని బయట పెట్టాడు రాజ్ తరుణ్. అయితే ఈవార్తలు నమ్మి కొందరు తనకు ఫోన్ చేసి లాస్యతో కలిసి లేచిపోయి వస్తే తాము హెల్ప్ చేస్తాం అంటూ మెసేజ్ లు పెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని అంటున్నాడు ఈ యంగ్ హీరో.

కనీసం తాను లాస్య రెండు మూడు సార్లు కూడా కలవని నేపధ్యంలో ఇలాంటి ఎఫైర్ల వార్తలు పుట్టించి తాను గతంలో నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు’ సినిమాలోని ఫోటోను మార్పింగ్ చేసి తనను లాస్యను కలుపుతూ ఒక ఫోటో క్రియేట్ చేసిన వారి టాలెంట్ వారివారి కేరియర్ల పై పెట్టుకుంటే బాగా అభివృధిలోకి వస్తారు అంటూ సెటైర్లు వేసాడు రాజ్ తరుణ్. అంతేకాదు తాను పెళ్ళి చేసుకునే విషయం పై ఆలోచనలు 2019 వరకు ఉండవని ఈలోపున తనకు సోషల్ మీడియా ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా అభ్యంతరం లేదు అంటూ జోక్ చేసాడు.

ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ కు మంచి టాక్ వచ్చినా ఈసినిమాకు చెప్పుకోతగ్గ స్థాయిలో కలక్షన్స్ రాకపోవడంతో రాజ్ తరుణ్ సినిమాలకు కలక్షన్స్ స్టామినా తగ్గిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిన నేపధ్యంలో రాజ్ తరుణ్ సినిమాలకు అనుకున్న స్థాయిలో ఈమధ్య కలక్షన్స్ రాకపోవడం నటుడుగా మంచి పేరున్నా సక్సస్ రేట్ విషయంలో ఈయంగ్ హీరో వెనక పడుతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: