మెగా వారసత్వాన్ని నమ్ముకుని మెగా అభిమానుల ప్రాపకం పై ఆధారపడి సినిమాలు చేస్తున్న సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు తమ సినిమాల ఎంపికకు సంబంధించి వ్యూహాత్మకమైన తప్పులు చేస్తున్నారు అంటూ కొందరు విశ్లేషకులు ఈ ఇద్దరి యంగ్ హీరోల పై కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెగా వారసత్వాన్ని నమ్ముకుని అయినా కేవలం మెగా అభిమానులను టార్గెట్ చేస్తూ మిగతా ప్రేక్షక వర్గాలను మరిచిపోతున్నారా ? అని పించే విధంగా ప్రస్తుతం వీరి సినిమాల ఎంపిక కనబడుతోంది అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని శర్వానంద్ నిఖిల్ రాజ్ తరుణ్ ఒకొక్క మెట్టు ఎక్కుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ లు మాత్రం కేవలం చిరంజీవి పవన్ ల ఇమేజ్ ని నమ్ముకుని తమ సినిమాల ఎంపికలో సరైన శ్రద్ధ కనపరచడం లేదు అన్న అభిప్రాయం కూడ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది.

సాయి ధరమ్ తేజ్ కేవలం మాస్ ఇమేజ్ ని నమ్ముకుంటే వరుణ్ తేజ కొంత వరకు మాస్ ఇమేజ్ కి దూరంగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉన్నా అవి నేటి యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాలుగా ఉండక పోవడంతో వీరిద్దరూ తమ సినిమాలకు సంబంధించి ఒక పరిధిని దాటి ముందుకు వెళ్ళలేక పోతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు వీరిద్దరూ నటిస్తున్న సినిమాలకు దాదాపు 20 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్న నేపధ్యంలో ఆ రేంజ్ లో వీరి మూవీలకు కలక్షన్స్ స్టామినా లేకపోవడంతో వీరిద్దరికీ మెగా నేపధ్యం ఉన్నా చాలామంది దర్శక నిర్మాతలు ప్రస్తుతం వీరి వంక ఆసక్తి కనపరచడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ మెగా హీరోలు ఇద్దరికీ ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులు మాత్రమే చేతిలో ఉన్న నేపధ్యంలో అవి కూడ హిట్ కాకపోతే వీరి మెగా కుటుంబ బ్యాక్ గ్రౌండ్ వీరికి ఏమాత్రం కలిసి రాకపోయినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ప్రస్తుత పోటీ వాతావరణంలో ఈ మెగా హీరోలు ఇద్దరికీ అనుకోని కష్ట కాలం ఎదురైంది అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ లో కొంత వరకు వాస్తవం ఉంది అని అనిపించడం సహజం..   


మరింత సమాచారం తెలుసుకోండి: