ఈ మద్య హైదరాబాద్ లో భారీ ఎత్తున్న డ్రగ్స్ ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారు వెల్లడించిన కొన్ని విషయాలు పోలీసులను సైతం విస్మాయానికి గురి చేశాయి. స్కూల్ విద్యార్థుల నుంచి మొదలు కొని కాలేజ్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే కాకుండా సినిమా రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా వాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టాలీవుడ్ కి చెందిన హీరో, హీరోయిన్లు, డైరెక్టర్, టెక్నీషియన్స్ పేర్లు సోషల్ మీడియాలో రావడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
మరోవైపు తమకు ఎలాంటి నోటీసులు రాలేదని..తమపై అసత్య ఆరోపణలు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది డ్రగ్స్ వాడుతున్నట్లు వార్తలు రావడం బాధాకరం. 10 మందికి నోటీసులు వచ్చినంత మాత్రాన మొత్తం ఫిలిం ఇండస్ర్టీనే తప్పు పట్టడం సమంజసం కాదు. కొంత మంది పెద్ద నిర్మాతల పిల్లలకు బదులుగా వేరే వాళ్ల పేర్లను సూచిస్తున్నారని అంటున్నారు. అదీ కరెక్ట్ కాదు.
క్కడ తప్పు చేసిన ఏ ఒక్కరు తప్పించుకోలేరు. ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకుంటే దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీస్ అధికారి అకున్ సబర్వాల్ కేస్ ఇన్వస్టిగేషన్ చేస్తున్నారు. ఆయన సెలవులను సైతం క్యాన్సిల్ చేసుకుని ప్రత్యేక శ్రద్దతో దర్యాప్తు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే తప్పు చేయని వాళ్లకు టీ-ఫిలిం ఛాంబర్ తరుపున మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నోటీసులు అందుకున్న వారు కూడా ముద్దాయిలు కారు. కేవలం వాళ్లను విచారణకు హజరవ్వాలనే కోరారు. దోషులెవరు...నిర్దోషులెవరన్నది అక్కడే తేల్తుంది. అయితే దీనిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఫిలిం చాంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత మాట్లాడుతూ, ఎందరో గొప్ప నటుల వల్ల తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంది. మనది బంగారం లాంటి ఇండస్ర్టీ. కానీ కొంత మంది వల్ల పరిశ్రమ బ్రష్టు పట్టి పోతుంది. డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారిని పబ్బుల్లోనే సప్తై చేస్తున్నారు. ఆ పబ్ లు కూడా ఇప్పటి కొంత మంది యంగ్ హీరోలు రన్ చేస్తున్నారు. అలాంటి పబ్ లను ప్రభుత్వం తక్షణమే బ్యాన్ చేయాలి. లేదంటే డ్రగ్స్ మత్తు నుంచి బయట పడడటం కష్టం. సినిమాల్లో అవకాశాలు రాలేదని..ప్రెస్టేషన్ కు గురై మత్తుకు బానిసవుతున్నారు. అలాంటి వాళ్లంతో చీకటిని వదిలి వెలుగు లోకి రావాలి. ఎక్కువ సమయం కుటుంబంతో గడపాలని సూచించారు.