దర్శకుడు బాబీకి రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం జూనియర్ తో బాబి తీస్తున్న ‘జై లవ కుశ’ సినిమా పరిస్థితి అని అంటున్నారు. జూనియర్ తన కెరియర్ లో మొట్టమొదటి సారి ఈసినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్న నేపధ్యంలో ఈమూవీని మాస్ ఎంటర్ టైనర్‌గా మలిచే ప్రయత్నంలో డైరెక్టర్ బాబీపై ఒత్తిడి పెరుగుతోందని ఇన్‌సైడ్ టాక్.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ అయినా తన స్టోరీ స్క్రీన్ ప్లేపై నమ్మకంతో ఈ భారీ ప్రాజెక్ట్ జూనియర్ బాబీకి ఇచ్చాడు అన్న ప్రచారం ఉంది. అయితే బాబి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి టేకింగ్ పరంగా క్వాలిటీ కోసం షెడ్యూల్స్ స్లో కావడం మరొక వైపు రిలీజ్ డేట్ ఫిక్స్ అవడంతో బాబీ మళ్ళీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా పరిస్థితిలాగే పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్‌లో ఉన్నట్టు టాక్.

ఈమూవీకి సంబంధించి గ్రాఫిక్ వర్క్ కూడా అనుకున్న టైంకు అవుతోందా ? లేదంటే ఈమూవీని కాంప్రమైజ్‌తో ఫినిష్ చేయాలా ? అనే డౌట్స్ తో బాబి తీవ్ర స్థాయిలో మధన పడుతున్నట్లు టాక్. అయితే కళ్యాణ్ రామ్ తారక్‌లు ఎలాగైనా ఈమూవీని అనుకున్న సెప్టెంబర్ 21వ తేదీకే రావాలని పట్టుదల పట్టడంతో బాబీ ఒత్తిడితో తీవ్రంగా మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈసినిమాను అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు కూడ మరోసారి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫీట్ రిపీట్ అవుతుందా అని బయ్యర్లు తెగ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికీ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా రెండు పాటల చిత్రీకరణ జరపాల్సి ఉంది అని టాక్. 

ఒక పక్కన  పక్కన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది గానీ, ఇందులో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడమే తాజా ఆందోళనకు కారణం అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుండగా ఈ మూడు పాత్రలు కూడా ఒకే సమయంలో రన్ అవుతాయట. దీంతో గ్రాఫిక్స్ వర్క్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో నాణ్యత రీత్యా చాలా సమయం తీసుకుంటోంది అని వార్తలు వస్తున్నాయి. అయితే జూనియర్ ఇచ్చిన టార్గెట్ ను అందుకోవడానికి బాబీ పరుగులు తీస్తున్నా ఈ ప్రయత్నాలలో ఎక్కడో ఎదో లోపం జరిగే అవకాసం ఉంది అన్న గాసిప్పులు ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: