బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలతో నవ్వుల పూవ్వులు పూయించిన ‘కపిల్ శర్మ’ కామెడీ షో ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఎన్నో కాంట్ర వర్సీలకు కేంద్రబిందువుగా కపిల్ శర్మ మారిపోయారని ఆయనపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. అంతే కాదు సినిమా సెలబ్రెటీలను కూడా తన షోలో వెయిటింగ్ చేయిస్తూ ఇరిటేషన్ తెప్పించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. దీంతో ఈ ప్రోగ్రామ్ పై విమర్శలు తీవ్ర స్థాయిలో రావడంతో టెలికాస్ట్ చేస్తున్న చానల్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.
అంతే కాదు ఈ మద్య సునీల్ గ్రోవర్ షో నుంచి తప్పుకున్న తర్వాత రేటింగ్స్ దారుణంగా పడిపోయి.. తన రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. న్నాళ్ల పాటు కపిల్ శర్మ షో ఉండదని షో టెలికాస్ట్ అయ్యే చానెల్ స్పష్టంచేసింది. ఈ విషయాన్ని ఇవాళ కపిల్ శర్మ కూడా ధృవీకరించాడు. ఈ మద్య తన ఆరోగ్యం పూర్తిగా సహకరించడం లేదని..ఇలాంటి సమయంలో నేను ఆ షో చేయలేనని కపిల్ శర్మ అన్నారు.
త్వరలో నా కొత్త చిత్రం కూడా రిలీజ్ కాబోతుందని రానున్న రోజుల్లో షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ చానెల్ తో మాట్లాడి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో వైపు కపిల్తో తమ బంధాన్ని కొనసాగిస్తామని చానెల్ కూడా స్పష్టంచేసింది. చ్చే వీకెండ్ నుంచి కొత్త కామెడీ షో ద డ్రామా కంపెనీ రాత్రి 9 గంటలకు.. కపిల్ శర్మ షో రిపీట్స్ 8 గంటలకు టెలికాస్ట్ చేస్తామని చానెల్ ప్రతినిధి వెల్లడించారు.