‘జై లవ కుశ’ ఆడియో రిలీజ్ ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ విని తారక్ అభిమానులు అయోమయంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘జనతా గ్యారేజ్’ సినిమా  తరువాత మనసుకు నచ్చిన కథ చేయాలా లేక ట్రెండ్ ఫాలో అవ్వాలా అని తెగ ఆలోచించాను అని అంటూ ‘జై లవ కుశ’ కథ  తన మనసుకు బాగా నచ్చిన కధ అని కామెంట్స్ చేయడంతో ఈమూవి నేటి ప్రేక్షకుల ట్రెండ్ ను ఫాలో అవ్వకుండా కేవలం జూనియర్ మనసుకు నచ్చిన సినిమాగా  మిగిలిపోతుందా అన్న కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. 

అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించేలా ‘జై లవ కుశ’ సినిమా తెరకెక్కిందని చెపుతూ ఎన్టీఆర్  తన తండ్రి హరికృష్ణకు కానుకగా ఈ సినిమా ఇవ్వాలనుకుంటున్నానని ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే తన తండ్రి 60వ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేద్దాo  అని అనుకున్నాము అంటూ  2 అయితేనేం 21 అయితేనేం ఎప్పటికైనా ఇది తన తండ్రికి  కానుక మాత్రమే అని అంటున్నాడు. 

ఇది కేవలం సినిమా మాత్రమే కాదని తన తండ్రి హరికృష్ణకు అన్నదమ్ములం కలిసి ఇస్తున్న కానుక ఇది అని చెపుతూ తన తండ్రి  సగర్వంగా చెప్పుకొనే చిత్రం అవుతుందని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డాడు. రేపటి రోజున మా అన్నదమ్ముల పిల్లలు ఏదైనా సినిమా చూడాలని అనుకున్నప్పుడు తామిద్దరం కలిసి చేసిన సినిమా ఇదని వాళ్లు ఆనందంగా చెప్పుకోవాలి అని జూనియర్ మాటలతో ఉలిక్కి పడుతున్న జూనియర్ అభిమానులు ఈ సినిమాలో నేటి ట్రెండుకు వ్యతిరేకంగా ప్రయోగాలు ఉంటాయా అని భయ పడుతున్నట్లు టాక్. 

దీనికితోడు నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ మూవీ స్టొరీ లైన్ ఒక రొటీన్ సినిమా మాత్రమే అని చెప్పడంతో రొటీన్ సినిమా కథ పై ఇంత భారీ బడ్జెట్ ఎందుకు పెట్టారు అని అభిమానులు కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో వస్తున్న టాప్ హీరోల సినిమాలు అన్ని ఊహించని పరాజయాల బాట పడుతున్న నేపధ్యంలో ఈ సినిమా ఒక రొటీన్ కథ అని ఇస్తున్న సంకేతాలు దేనికి సంకేతం అన్న విషయం పై జూనియర్ అభిమానులలో గుబులు ఇప్పటికే బయలుదేరింది అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: