తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే నందమూరి హరికృష్ణ మాత్రం రాజకీయాల వైపు వెళ్లారు. కాగా నటసింహం బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక హరికృష్ణ నట వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కళ్యాన్ రామ్ హీరోగా చేస్తూనే నిర్మాణ బాద్యతలు చేపట్టారు. తాజాగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘జై లవ కుశ’ చిత్రం రిలీజ్ అయ్యింది.
కాగా, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ ల మద్య గొడవలు మొదలయ్యాయని అందుకు కారణం జై లవ కుశ చిత్రం బడ్జెట్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొదట్లో ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడంతో వీరిద్దరి మద్య అభిప్రాయ భేదాలు వచ్చాయని మీడియా కథనాలు. దీంతో ఈ వార్తలపై స్పందించిన నిర్మాత, హీరో కళ్యాన్ రామ్ మాట్లాడుతూ..అవన్నీ ఒట్టి రూమర్లు మాత్రమే అన్నారు.
ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ లో గొడవలు అనేవి జరగలేదని..ఇక ముందు కూడా జరగబోవని అన్నారు. అయితే జై లవకుశ సినిమా అనుకున్నప్పుడు ఒక బడ్జెట్.. షూటింగ్ జరుగుతున్న కొద్దీ అది పెరగడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయని అవన్నీ కట్టు కథలే అన్నారు.
ఏ సినిమా కైనా బడ్జెట్ పెరగడం కామన్ అని అసలు మా మధ్య విభేదాలు లేవని , రావని స్పష్టం చేశాడు కళ్యాణ్ రామ్. అంతే కాదు జై లవ కుశ మంచి విజయం సాధిస్తుందని..ఎన్టీఆర్ తో ఒక్క జై లవకుశ మాత్రమే కాదు ఇంకా మరిన్ని సినిమాలను మా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తామని అంటున్నాడు. కాబట్టి అన్నా దమ్ముల మధ్య గొడవలు అంతా ఉత్తి దే అన్నమాట.