ఈ మద్య హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది.  ఆ మద్య ఏపీ మంత్రి నారాయణ తనయుడు అతి వేగంతో కారు నడపడం వల్ల యాక్సిడెంట్ కావడంతో చనిపోయారు..హీరో రవితేజ తమ్ముడు భరత్ కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  గతంలో సినీ ప్రముఖుల తనయులు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు. మరోవైపు ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరగకుండా కఠిన నియామాలు అమల్లోకి తెస్తున్నా..ఈ ప్రమాదాల స్థాయి తగ్గడం లేదు.

హీరో  రాజశేఖర్ కారు ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది.  హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ముందువెళ్తున్న రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్‌ కారును రాజశేఖర్‌ కారు వెనుకవైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై రాజశేఖర్ తో  రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

రాజశేఖర్ తాగి కారు నడిపి ప్రమాదానికి కారణం అయ్యాడని రామిరెడ్డి తన పిర్యాదులో పేర్కొన్నాడు. రాజశేఖర్ తల్లి ఇటీవలే మరణించారు... ఆ డిప్రెషన్లోనే కారు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని నటుడి కుటుంబీకులు తెలిపారు.
Related image
ప్రమాదం చిన్నదే అని,ఈ వ్యవహారంపై రాజశేఖర్ కుటుంబ సభ్యులు రామిరెడ్డితో చర్చలు జరిపి ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేసినట్టు సమాచారం.ఆయన మద్యం సేవించలేదని తేలిందని... ఈ ఘటనపై కేసు నమోదు చేయడం లేదని రాజేంద్రనగర్ ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: