తెలుగు ఇండస్ట్రీలో అమ్మ, వదిన, అత్తయ్య లాంటి పాత్రల్లో ఎంతో హుందాగా నటిస్తూ..ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కెరీర్ కొనసాగిస్తున్న నటి సుధ.  ఇండస్ట్రీలో ఇప్పటి వరకు దాదాపు అందరు టాప్ హీరోలతో నటించిన సుధ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు ఇండస్ట్రీ తనను ఎంతగానో ఆదరించిందని..తెలుగు ప్రేక్షకులు తనను సొంత ఇంటి మనిషిలా చూసుకుంటున్నారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.  ఇండస్ట్రీలో తాను ఓ హీరోకి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన చేసిన సహాయం తన జీవితాన్ని నిలిపిందని అన్నారు.
Image result for tollywood actress sudha
ఇంతకీ ఈ హీరో ఎవరా అని అనుకుంటున్నారా..! ఆ హీరో ఎవరో కాదండీ..కింగ్ నాగార్జున.  'ప్రెసిడెంట్ గారి పెళ్లాం' సినిమా షూటింగ్ సమయంలో తనకి అపెండిసైటిస్ వల్ల తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని ఆమె అన్నారు.  ఆ టైమ్ లో తాను షూటింగ్ బిజీలా ఉన్నానని ఏవో మాత్రలు వేసుకుంటూ మ్యానేజ్ చేస్తు షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నానని..ఇలా రెండు రోజులు గడిచాయి. 

మూడో రోజున మేకప్ చేసుకుని సెట్ కి వెళ్లాననీ, సెట్లో అడుగుపెడుతూనే కుప్పకూలి పోయానని అన్నారు.  నా అదృష్టం కొద్ది షూటింగ్ సెట్ లో నాగార్జున ఉండటం..వెంటనే ఆయన వాహనంలో..'అపోలో' హాస్పిటల్లో చేర్పించారని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయించడం వలన తాను బతికి బయటపడ్డానని అన్నారు. ఇప్పటికీ..ఎప్పటికీ ఆ సంఘటన మర్చిపోలేనని..ఈ రోజున తాను ఇంకా మిగిలి ఉండటానికి కారణం నాగార్జున అని చెప్పుకొచ్చారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: