గత కొంత కాలంగా సోషల్ మీడియాలో కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ కి మద్య పెద్ద యుద్దమే కొనసాగుతుంది. పవన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా కత్తి మహేష్ ప్రతి చిన్న విషయంపై సెటైర్లు వేస్తున్నారు..దీంతో కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ కూడా తిట్లదండకం అందుకుంటున్నారు. ఇదంతా సోషల్ మీడియా సాక్షిగానేకాదు..కొన్ని ఛానల్స్ సాక్షిగా కొనసాగుతుంది. ఇక తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ తగినంత స్థాయిలో గుర్తింపురాలేదు..కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంతో పూనమ్కు కాస్త ఊరట లభించింది.
పూనమ్ కౌర్ మొదటి నుంచి పవర్స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. తాజాగా నటి పూనమ్ కౌర్ సెన్సేషనల్ ట్విట్ చేసింది. 'ఇతరులను విమర్శించడం ద్వారా డబ్బులు సంపాదించాలకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్తములు. ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ సమస్య. ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి అతనికి డబ్బులు డొనేట్ చేయండి.
మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మనం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. అతనికి మంచి పని దొరకాలని కోరుకుంటున్నాను' ట్వీట్ చేసింది. ఇది పరోక్షంగా కత్తి మహేష్ పై అంటూ వార్తలు రావడంతో..దీనిపై స్పందించిన కత్తి మహేష్..సదరు హీరోయిన్ తనను ఫ్యాట్సో అంటూ మాట్లాడడంతోనే ఆమె సంస్కారం ఏంటో తెలిసిపోతోందని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ విమర్శించారు. పవన్ కల్యాణ్ చేసిన సాయంతో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఎంపికైందని అన్నారు.
పవన్ మెప్పు కోసం తనపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు. పవన్ కల్యాణ్ వల్ల ఆమెకు ఉద్యోగం వచ్చిందని, పవన్ కల్యాణ్ ఆమెకు బతుకుదెరువు చూపించినందుకు ఆమె తనపై విమర్శలు చేస్తోందని అన్నారు. అంతే కాదు గతంలో 'పవన్ కల్యాణ్కి నాలుగో భార్య అవ్వడానికి రెడీ అని హీరోయిన్ పూనం కౌర్ అన్నారు. ఆమె రెండు మూడు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని తెలిపింది. కావాలంటే యూ ట్యూబ్లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలను చూసుకోండి' అని కత్తి మహేశ్ అన్నారు.