ఇప్పటి వరకు ఊరిస్తూ వస్తుననా ‘అజ్ఞాతవాసి' సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. కొంత కాలంగా  వరుసగా ఫ్లాపులు వచ్చినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదు. అయినప్పటికీ సినిమా ఓవర్సీస్‌లోనూ అదరగొట్టేందుకు రెడీ అయ్యిందని అందరూ తెగ సంతోష పడ్డారు. ప్రివ్యూ టాక్ పాజిటీవ్ గా రావడంతో..ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ని డామినేట్ చేస్తుందని అందరూ భావించారు. 
Image result for baahubali 2
అమెరికాలోనూ అజ్ఞాతవాసి భారీ స్క్రీన్లలో విడుదల అయ్యింది..ఈ నేపథ్యంలో యూఎస్‌లో ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తుందని ప్రీమియర్స్ తోనే అలవోకగా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేశారు.  మరోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివి‌క్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న"అజ్ఞాత‌వాసి'' సినిమాలో పవన్ పాడిన ''కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు ఖ‌రుసైపోత‌వురో.." అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. 
Image result
తాజాగా ఓవర్ సీస్ లో తొలి ప్రీమియర్ కలెక్షన్ల రికార్డులను 'అజ్ఞాతవాసి' బ్రేక్ చేయలేకపోయింది. రాజమౌళి చిత్రం 'బాహుబలి-2' కన్నా అధిక థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఆ చిత్రం ప్రీమియర్ షో కలెక్షన్ల రికార్డులను దాటలేకపోయిందని ట్రేడ్ నిపుణులు తేల్చారు. కాకపోతే..బాహుబలి 2 ని మాత్రం బీట్ చేయలేక పోయిందని..గత రాత్రి వేసిన తొలి షోల ద్వారా 14,64,647 డాలర్లు వసూలయ్యాయని, ఇది రెండో ఆల్ టైమ్ హయ్యస్ట్ రికార్డని పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆ తరువాతి స్థానాల్లో బాహుబలి, ఖైదీ నంబర్ 150 ఉన్నాయని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: