పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ ​25వ సినిమా అజ్ఞాతవాసి సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు నుంచి వ‌రుస‌గా వివాదాల్లో చిక్కుకుంది. ఇక కొద్ది రోజులుగా సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌ధ్య వివాదం జ‌రుగుతున్న నేప‌థ్యంలో క‌త్తి ప‌దే ప‌దే ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌త్తి ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి సినిమాను కూడా ఓ రేంజ్‌లో టార్గెట్ చేశాడు.


ఈ సినిమా రిలీజ్‌కు ముందు క‌త్తి  ‘‘త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’’ అని రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. క‌త్తి వ్యాఖ్య‌ల ప్ర‌కారం ఈ సినిమా ఫ్రెంచ్ సినిమా అయిన లార్గో వించ్‌కు కాపీ అన్న‌ది టాక్‌.


అయితే ఇప్పుడు సినిమా చూస్తే త్రివిక్ర‌మ్ అడ్డంగా దొరికిపోయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఈ సినిమా కాపీ అని క‌త్తి మ‌హేష్ చేసిన మాటలు అక్ష‌రాలా నిజంగానే క‌నిపిస్తున్నాయి. అజ్ఞాత‌వాసి లార్గో వించ్‌ కు ఇన్సిపిరేషన్‌ కాదు.. మక్కీకి మక్కీ కాపీనే అనే క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. ఆ సినిమాలో ఉన్న క‌థ‌నే త్రివిక్ర‌మ్ మక్కీకి మ‌క్కీ దించేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. మ‌రో షాక్ ఏంటంటే కొన్ని లొకేష‌న్లు సైతం కూడా అలాగే వాడేశారు.

ఈ సినిమా ద‌ర్శ‌కుడు జెరోమ్‌ సలే.. అజ్ఞాతవాసి  షో చూశాకే కాపీ వ్యాఖ్య‌లు చేశాడ‌ని జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ సినిమా లార్గో వించ్‌ను పోలి ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చినా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స్పందించ‌లేదు. ఇక ఇప్పుడు సినిమా చూశాక ఇది ప‌క్కాగా రూడీ అయిన నేప‌థ్యంలో దీనిపై వారు ఎలా స్పందిస్తారో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: