తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ‘బద్రి’ చిత్రంతో దర్శకుడిగా మారారు పూరి జగన్నాథ్, ఆ తర్వాత ఇడియట్, పోకిరి లాంటి సినిమాలతో టాప్ డైరెక్టర్ లీస్టు లో చేరిపోయారు. పూరి తీసే సినిమాల్లో మాఫియా, పోలీస్ కి సంబంధించిన కథాంశాలే ఎక్కువగా ఉంటాయి. పోకిరి, టెంపర్ ఈ తరహా చిత్రాలు కావడంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. ఈ మద్య పూరి తీసిన సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేక పోతున్నాయి.
ప్రస్తుతం ఆయన తనయుడు ఆకాశ్ పూరితో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. . ఆకాశ్, నేహాశెట్టిపై ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పంజాబీ అమ్మాయి చార్మి 2002లో 'నీ తోడు కావాలి' అనే సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు..ఆ తర్వాత కృష్ణ వంశి, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ తో తన అందాల ప్రదర్శనతో బాగా పాపులర్ అయ్యింది.
వరుసగా పెద్ద హీరోలతో నటించిన ఈ అమ్మడు తమిళ, మళియాళ, హిందీ ఇండస్ట్రీలో కూడా నటించింది. అయితే తెలుగు లో గత కొంత కాలంతా పూరి, ఛార్మీల మద్య అఫైర్ ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే వీరిద్దరూ ఫంక్షన్లలో, పబ్బుల్లో కలిసి తిరగడం..ఆ రూమర్లు ఖండించకపోవడం విశేషం. ఈ మద్య ఛార్మీ సినిమాలు పెద్దగా రావడంలేదు..కాకపోతే సినిమాలు పక్కనబెట్టి నిర్మాణ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే పూరి కనెక్ట్స్ కింద 'జ్యోతిలక్ష్మి' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. బాలయ్య నటించిన 'పైసా వసూల్' చిత్రానికి కూడా ఆమె కోప్రోడ్యూసర్ గా వ్యవహించింది.తాజాగా పూరి, ఛార్మీ లు ఓ పబ్బులో సందడి చేశారు. తమ మిత్రులతో కలసి బాలీవుడ్ పాటలకు హుషారుగా చిందేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.