ఒకప్పుడు కర్ణాటకలో కొంత మంది దుండగులు జరిపిన అరాచకాలు..అక్రమాలు వెలుగులోకి వచ్చాయి..వారికి దండుపాళ్యం దొంగలు అపి పేరు కూడా పెట్టారు.  అయితే ఇదే పేరుతో కన్నడభాషలో శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో ‘దండుపాళ్యం’చిత్రం తెరకెక్కింది.   ఈ కన్నడ సినిమాలో పూజా గాంధీ, మకరంద్ దేశ్ పాండే, రవి కాలే, రవి శంకర్, సంజన ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులోకి కూడా అనువాదం చేశారు.  రెండు భాషల్లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది..కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి.దాంతో ‘దండుపాళ్యం 2’, ‘దండుపాళ్యం 3’ చిత్రాలను కూడా తెరకెక్కించారు. ‘దండుపాళ్యం 2’ ఇప్పటికే విజయవంతం అయ్యింది.  ఇక దండుపాళ్యం 3 విడుదలకు సిద్దంగా ఉంది. 
Related image
‘దండుపాళ్యం ’ నటించిన వారే..తరవాత రెండు సీక్వెల్స్‌లోనూ నటించారు.  ఇదిలా ఉంటే, ‘దండుపాళ్యం 4’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత వెంకట్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రెస్ మీట్ పెట్టి శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దండుపాళ్యం 4’ ఫస్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.   తాజాగా ఈ పోస్టర్ పై వివాదం చెలరేగుతుంది.  దీనికి కారణం మొదటి మూడు సిరీసుల్లో నటించిన పూజా గాంధీ, మకరంద్ దేశ్ పాండే, రవి కాలే, రవి శంకర్ ముఖ చిత్రాలు ఉన్నాయి. అంటే ‘దండుపాళ్యం 4’ సినిమాలోనూ వీరంతా నటుస్తున్నారని ప్రేక్షకులు భావిస్తారు. కానీ తాము ‘దండుపాళ్యం 4’లో నటించడం లేదని వీరంతా స్పష్టం చేశారు.
Image result for dandupalyam
సినిమా కోసం తమను ఎవరూ సంప్రదించలేదని, తమ అనుమతి లేకుండా ముఖ చిత్రాలను పోస్టర్‌పై ఎలా వాడుకుంటారని పూజా గాంధీతో పాటు మిగిలిన నటులు ప్రశ్నిస్తున్నారు.  తాజాగా పూజాగాంధి ఈ విషయం స్పందిస్తూ... ‘నేను దండుపాళ్యం 4 సినిమా చేయటం లేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు.
Image result for dandupalyam 3
నిన్న దండుపాళ్యం 4 చిత్రం ప్రెస్ మీట్‌లో నా అనుమతి లేకుండా నా ఫొటోస్ వాడారు. నా ప్రమేయం లేకుండా నా ఫొటోస్ ఎలా వాడతారు’ అని ప్రశ్నిస్తున్నారు. అలాగే మకరంద్ దేశ్ పాండే, రవి కాలే కూడా ‘దండుపాళ్యం 4’ సినిమా చేయటం లేదని వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: