మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తూ ఉంటాడు. మెగా అభిమానులతో తరుచు సమావేశాలు నిర్వహిస్తూ వారందరితో ఎప్పుడు టచ్ లో ఉండే చిరంజీవి తన తీరుకు భిన్నంగా ప్రస్తుతం అమెరికాలో ప్రవర్తించిన సంఘటనకు సంబంధించిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి అమెరికా వెళ్ళి అక్కడ మా అసోసియేషన్ కి సంబందించిన కార్యక్రమానికి విరాళాలు సేకరించే పనుల్లో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ సందర్భంలో చిరంజీవి అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఒక ఈవెంట్ కు అతిధిగా హాజరు అయినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈకార్యక్రమానికి సంబంధించిన పాసులను ఒకొక్కదానికి 100 డాలర్ల ధర కట్టి అమ్మినట్లు టాక్. 
సంబంధిత చిత్రం
అయితే ఈకార్యక్రమానికి అమ్మిన టిక్కెట్లలో సుమారు 30 టిక్కెట్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి ఆ టిక్కెట్ విజేతలకు చిరంజీవితో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పిస్తామని ఆ కార్యక్రమ నిర్వాహకులు ప్రచారం చేసారు. అయితే ఆ కార్యక్రమం ప్రారంభం కాగానే చిరంజీవిని చూడటానికి వచ్చిన ఎన్ఆర్ఐలు ఒకేసారి చిరంజీవి చుట్టూ గుమిగూడటంతో ఆకార్యక్రమ నిర్వాహణ అదుపుతప్పింది అని తెలుస్తోంది. దీనితో అసహనానికి లోనైన చిరంజీవి ఆకార్యక్రమంలో పూర్తిగా ఉండకుండా తన అభిమానులను నిరాశపరుస్తూ వెంటనే తిరిగి వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈకార్యక్రమ నిర్వాహకులు ఎంత నచ్చ చెప్పినా చిరంజీవి వారి అభ్యర్ధనను మన్నించనట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్ అమెరికా వచ్చినప్పుడు ఇదే విధంగా తన అభిమానుల తాకిడి ఎక్కువ అయిపోవడంతో అసహానానికి గురై హోటల్ లో తలుపులు వేసుకుని గంటల కొద్ది కూర్చున్న విషయం తెలిసిందే. దీనితో ఓవర్సీస్ కలక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేస్తున్న మెగా హీరోల కుటుంబానికి చెందిన చిరంజీవి  ఆ కలక్షన్స్ కు కారణం అయిన ఎన్ఆర్ఐ లను పట్టించుకోకపోవడం దారుణం అంటూ ఆకార్యక్రమానికి వచ్చిన చాలామంది ఎన్ఆర్ఐలు కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: