బాలీవుడ్ లో మల్లికా షెరావత్ అంటే శృంగార తారగా ఎంతో పాపులర్ నటి అని చెబుతారు. సెక్సీ పెర్పార్మెన్స్, ముద్దు సీన్లతో ఇండియన్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన బ్యూటీ. సినిమాల్లో నటించడం తగ్గించిన తర్వాత చాలా రేర్‌గా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఈ హాట్ బ్యూటీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.  నాకు కేన్స్‌లో ఇది తొమ్మిదో ఏడాది. బాలికలపై భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అకృత్యాలపై అవగాహన కల్పించేందుకు ఇదే మంచి వేదిక. బాలికల రక్షణ కోసం ప్రముఖ బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో వినూత్న ప్రచారం నిర్వహించింది. 

ప్రతి నిమిషానికి ఒక ఘోరం

నన్ను నేను ఇలా బోనులో బంధించుకోవడంతో ఆడపిల్ల బాధలు తెలుస్తున్నాయి.  ఈ ఏడాది మల్లికా బాలికల రక్షణ కోసం ‘ఫ్రీ గర్ల్‌’ అనే ఎన్జీవో తరఫున కేన్స్‌లో ప్రచారం చేయాలనుకున్నారు. బాలికలను  ఇదే విధంగా ఎందరో బాలికలను వాహనాల్లో తరలిస్తున్నప్పుడు వారు పడే బాధను ఊహించగలుగుతున్నాను. ఆ అమాయక చిన్నారులు ఎలాంటి సాయం లేకుండా అలాగే బతుకీడుస్తున్నారు. నిమిషానికి ఓ మహిళపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 

మల్లికా కేన్స్ రెడ్ కార్పెట్ షో...

 చిన్నారులు ఎలాంటి సాయం లేకుండా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు అని మల్లికా షెరావత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒక మహిళపై ఘోరం జరుగుతోంది. వారి జీవితాల్లో మార్పు వస్తుందనే నమ్మకం లేకుండా బ్రుతుకుతున్నారు. అందుకే అలాంటి వారి కోసం నా వంతు ఏదన్నా సాయం చేయాలనుకున్నాను, అందుకే ఈ అవేర్‌నెస్ కాంపెయిన్ నిర్వమిస్తున్నాను అని మల్లికా షెరావత్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: