తెలుగు ఇండస్ట్రీలో ‘ఝమ్మందినాదం’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఈ చిత్రంలో తాప్సీ చేసిన ఎక్స్ పోజింగ్ కి కుర్రాళ్ల మతులు పోయాయి. ఆ తర్వాత వరుసగా కొన్ని చిత్రాల్లో నటించినా తెలుగు లో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది తాప్సీ. దాంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఆంగ్ల పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖితో కలిసి తాను నటించనని తాప్సి అన్నారంటూ ఓ పత్రిక వార్తపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పత్రికలో ఏం రాశారంటే..‘తాప్సి నవాజుద్దిన్తో నటించడం ఇష్టం లేక దర్శకుడు హనీ ట్రెహన్ సినిమాకు నో చెప్పారు. ఓ మర్డర్ మిస్టరీ ఆధారంగా తాప్సితో హనీ సినిమా తీయాలనుకున్నారు. అయితే ఈ చిత్రంలో నవాజుద్దిన్ నటిస్తున్నారని తెలీగానే తాప్సి నటించనని చెప్పారు’ అని రాశారు.
అంతే కాదు ఆ వార్తకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాప్సీ కి చిర్రెత్తుకొచ్చింది. తాను ఎక్కడ కూడా నవాజుద్దీన్ తో నటించనని చెప్పలేదు..కానీ బాధ్యతలేని జర్నలిజం మాత్రం నన్న దారుణంగా రచ్చకీడ్చారని వాపోయింది. కలానికి పని చెప్పేముందు ఫలానా వ్యక్తిని సంప్రదించి నిజనిజాలు తెలుసుకోవాలన్న ఇంగితజ్ఞానం కూడా లేదు. ఇదేం బాలేదు.’ అని పేర్కొన్నారు. కాగా, తాప్సీ ట్విట్ పై స్పందించిన సదరు జర్నలిస్ట్ తనకు ఏమీ తెలీదని.. ఇందుకు కారణం తన పీఆర్ బృందమేనని తెలిపారు.
దీనిపై స్పందించిన తాప్సి.. మున్ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఆ రిపోర్టర్ను హెచ్చరించారు. ప్రస్తుతం ‘ముల్క్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు అభిషేక్ బచ్చన్కు జోడీగా ‘మన్మర్జియా’, తెలుగులో ఆదికి జోడీగా ‘నీవెవరో’ చిత్రాలతో బిజీగా ఉంది తాప్సీ.