కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో మంచి జోష్ లో ఉన్నారు సుకుమార్. రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ 1985 నాటి గ్రామీణ వాతావరణంలో అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకులు సుకుమార్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఇండస్ట్రీలో ‘వన్’చిత్రం తీసినప్పటికీ అది కమర్షియల్ గా హిట్ కాలేదు. దాంతో దర్శకులు సుకుమార్, మహేష్ బాబు కి మంచి హిట్ ఇవ్వడానికి ప్రయత్నంలో ఉన్నారని ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇందుకోసం అద్భుతమైన కథ కూడా రెడీ చేసుకుంటున్నట్లు ఆ మద్య వార్తలు చక్కర్లు కొట్టాయి. వంశీ పైడి పల్లి సినిమా పూర్తవ్వగానే… సుకుమార్ చిత్రం పట్టాలెక్కిద్దామనుకున్నాడు మహేష్. అయితే ఇప్పుడు ఈ చిత్రం కాస్త డైలామాలో పడింది.
సుకుమార్కి బాలీవుడ్ నుంచి ఆఫర్రావడమే ఇందుకు కారణం అనుకోవొచ్చు. వరుణ్ ధావన్ తో సుకుమార్ బాలీవుడ్లో ఓ చిత్రం చేసే ఛాన్సుందని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు వంశ పైడిపల్లి చిత్రం తర్వాత మహేష్ మరో ప్రాజెక్ట్ కి కమిట్ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ‘సైరా’ చిత్రం షూటింగ్ బిజీలో ఉన్న సురేందర్ రెడ్డి తర్వాత మహేష్ బాబు తో ఒక చిత్రాన్ని తీయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. మరి సుకుమార్, మహేష్ ల చిత్రం ఇప్పట్లో ఉందా లేదా? అన్న అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి.