బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారని తెలుసు. కానీ ఆయన ప్రేమకు మరో రూపం అని..‘బీయింగ్ హ్యూమన్’ పేరిట సల్మాన్ ఓ ఎన్జీవోను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక విరాళాలు సేకరిస్తున్నారు. ఎంతో మంది అనాధ పిల్లలను చేరదీశారు.. ఎన్నో వృద్దాశ్రమాలను ఏర్పాటు చేసి వారికి అన్ని వసతులు కల్పించారు. ఎంతో మందికి జీవినోపాధికి డబ్బు సహాయం చేశారు..ఇవన్నీ చాలా వరకు గోప్యంగా ఉంచుతారు సల్మాన్ ఖాన్.
తాజాగా సల్మాన్ ఖాన్ మరోసారి తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు. వెండితెరపై, బుల్లి తెరపై ఈ మద్య బిజీగా ఉంటున్న సల్మాన్ ఖాన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారి కోరిక తీర్చి సంతోష పరిచాడు. వివరాల్లోకి వెళితే..ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రిలో క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న బాలుడు సల్మాన్కి వీరాభిమాని కాగా, ఒకసారి సల్మాన్ని కలవాలనుందని కోరాడు. ఈ విషయం బాలుడి తల్లి మేనేజర్ ద్వారా సల్మాన్కి విషయాన్ని చేరవేసింది.
విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే స్పందించి బాలుడి వద్దకు వచ్చి గిఫ్ట్ ఇచ్చి కాసేసు ముచ్చటించాడు. సల్మాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారత్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది రంజాన్కు ఈ చిత్రం విడుదల కాబోతోంది. అంతే కాదు బాలీవుడ్ లో బిగ్ బాస్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు..ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తయ్యాయి. తాజాగా బాలుడిని కలిసిన సల్మాన్ ఖాన్ వీడియో సషల్ మీడియాలో వైరల్ అవుతుంది.