తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు గుణశేఖర్ ఆ మద్య ‘రుద్రమదేవి’తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత గుణశేఖర్ మరే చిత్రాన్ని తెరకెక్కించలేదు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ముఖ్యపాత్రలో కాకతీయ వీరవణిత రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ‘రుద్రమదేవి’చిత్రాన్ని తెరకెక్కించారు. హిస్టారికల్ చిత్రాలు తీయడంలో గుణశేఖర్ దిట్ట. అంతే కాదు ఇండస్ట్రీలో గుణశేఖర్ భారీ బడ్జెట్ తో చిత్రాలు తీస్తారని టాక్. అయితే గుణశేఖర్ తన దర్శకత్వంలో 'హిరణ్య కశిప' అనే సినిమా రూపొందనుందనీ, ఈ సినిమాలో టైటిల్ రోల్ ను రానా పోషించనున్నాడని ఆ మధ్య చెప్పారు.
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాకపోవడంతో అసలు ఈ చిత్రం ఉంటుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి స్టార్ డైరెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ..'హిరణ్యకశిప' చిత్రానికి సంబంధించిన అన్ని పనులు గుణశేఖర్ దగ్గరుండి చూసుకుంటున్నారని.. గ్రాఫిక్స్ పనులు 'లండన్' లో జరగనున్నాయి.
అంతే కాదు ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించనున్నారని అన్నారు. 'హిరణ్యకశిప' హిస్టారికల్ చిత్రం కావడంతో అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన వుంది. భారీ ప్రాజెక్టు కనుక ఆలస్యం అవుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు.