మొదటిరోజు మొదటి షో నుండి టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రజినీకాంత్ ‘2.0’ మ్యానియా ఒకేసారి సముద్ర కెరటంలా కిందకు పడిపోవడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీ విడుదలైన నిన్న ఐదవ రోజున ఈమూవీ కలక్షన్స్ ఊహించని స్థాయిలో పతనం కావడంతో సుమారు 600 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈమూవీ బయ్యర్లలో గుబులు పుట్టిస్తున్నట్లు సమాచారం. 
వీకెండ్ సూపర్ అనిపించింది
ఈమూవీ ఇప్పటి వరకు 400 కోట్లు కలక్షన్స్ వసూలు చేసింది అని ప్రచారం జరుగుతూ ఉన్నా నిన్నటి సోమవారం రోజున ఈమూవీ కలక్షన్స్ దాదాపు సగం పైగా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలలో చాల ఎక్కువగా ఉంది అని అంటున్నారు. 
 సోమవారం సగం మేర పతనం
తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్నికల హడావిడిలో ఉన్న పరిస్థుతులలో ఈమూవీ గురించి తెలంగాణ రాష్ట్రంలోని సాధారణ ప్రజలు పట్టించుకోకవడంతో ఈమూవీకి ఇలాంటి ఎదురీత ఏర్పడిందని అంటున్నారు. భారత దేశం యావత్తు శనివారం ఆదివారాలలో ఊహించని విధంగా సునామీ సృష్టించిన ఈమూవీ కలక్షన్స్ ఆలిండియా వైడ్ 20 కోట్లు కూడా రాలేదని ట్రేడ్ వర్గాల అంచనా. 
 వరల్డ్ వైడ్ ఎంత?
దీనితో ఈమూవీ బయ్యర్లకు సుమారు 200 కోట్ల నష్టం వస్తుంది అని విశ్లేషకుల అంచనా. దీనితో ‘బాహుబలి2’ రికార్డులకు అతి సమీపానికి కూడ ‘2.0’ రాలేదని ఏకంగా బాలీవుడ్ మీడియా అంగీకరిస్తూ వార్తలు వ్రాస్తున్న నేపధ్యంలో ఇప్పట్లో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసే మరొక మూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రానట్లే అనుకోవాలి. ఇప్పుడు ఈవార్తలు ఖచ్చితంగా రాజమౌళి వరకు చేరి అతడికి ఆనందాన్ని ఇస్తాయని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు..   



మరింత సమాచారం తెలుసుకోండి: