ఈ మద్య డబ్ స్మాష్ తో రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నవారు ఎందరో ఉన్నారు. అందులో కొంత మందికి బుల్లితెర, వెండితెరపై ఛాన్సులు కూడా వస్తున్నాయి. డబ్ స్మాష్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి బాగా పాపులర్ అయిన దీప్తి సునయన ఇటీవల బిగ్ బాస్ 2 సీజన్లో ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ కోవలో మృణాలినీ రవి కూడా చేరింది.
తమిళనాట తన డబ్ స్మాష్ తో కుర్రాళ్ల మనసు దోచిన మృణాలిని తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుందని అంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రంగా వచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
వరుణ్ తేజ్ త్వరలో తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండని రీమేక్ చేయనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ ఫిక్స్ చేశారు.థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో మరో హీరో నాగశౌర్య ఓ ముఖ్యపాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు.