తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’కి జనాలు నీరాజనాలు పట్టారు.  ఇక మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’రూపొందుతుంది.  ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే.  సంక్రాంతి కానుకగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది. 
Image result for yatra movie
ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ముఖ్యంగా ఆయన చేపట్టిన పాదయాత్ర పై తీసిన చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, దాదాపు రెండు దశాబ్ధాల అనంతరం చేసిన తెలుగు చిత్రం 'యాత్ర'. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు రాజకీయాలకు అతీతంగా జనాలు చిత్రాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. 
Related image
ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యాత్ర చిత్రం చూసిన  తరువాత తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందించిన రాఘవేంద్రరావు, "యాత్ర చూసాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకేక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశి కి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: