తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరు. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం మరో విశేషం. తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తున్ ‘మహర్షి’షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు, లిమిట్ బడ్జెట్ లో చిత్రాలు చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు.
అయితే తన డైరెక్టర్లతో ఎప్పుడూ ఫ్రీగా ఉండే మహేష్ బాబు ఈసారి అనీల్ రావిపూడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర యంగ్ డైరెక్టర్ కి సర్వ హక్కులు ఇవ్వడంతో మహేష్ చిత్రానికి కు దర్శకుడు అనిల్ ఎవరు ఊహించని నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. మహేష్ లెవెల్ కి తగ్గట్టు బాలీవుడ్ కోలీవుడ్ నుంచి సీనియర్ నటీనటులను తీసుకురావడం కామన్ గా మారింది. గతంలో అవకాశాలు వచ్చినా పెద్దగా పట్టించుకోని విజయశాంతి అనిల్ కథను చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక చిత్రంలో విజయశాంతి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. వీరిద్దరి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. మహేష్ కి కూడా దర్శకుడి ఐడియాలు నచ్చడంతో ఏమాత్రం అడ్డు చెప్పడం లేదట. మొత్తానికి అనీల్ రావిపూడి ఇతర నటీనటుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.