సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా సూపర్ హిట్ అయ్యి వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  ఇప్పట్లో పెద్ద సినిమాల హడావుడి లేకపోవడంతో మహర్షి కలెక్షన్లకు ఢోకా లేదు.  మరో వారం పదిరోజుల్లో మరో వంద కోట్ల రూపాయల మైలు రాయిని చేరుకొని ఈజీగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.  రిలీజ్ తరువాత మహేష్ ఎక్కడికి వెళ్లకుండా... టీమ్ తో ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.  మహేష్ థియేటర్స్ కు వెళ్లి ప్రచారం చేస్తుండటంతో సినిమాకు మరింత ప్లస్ అయింది.  


మే 18 వ తేదీన విజయవాడలో జరిగే విజయోత్సవ సభ తరువాత మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి వేసవి విడిదికి వెళ్ళబోతున్నారని సమాచారం.  వేసవి విడిది నుంచి తిరిగి వచ్చాక జూన్ లో సినిమా ఓపెనింగ్ లో పాల్గొంటారు.  జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.  అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  


రష్మిక మందన్న తొలిసారి మహేష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది.  ఈ సినిమా తరువాత రష్మిక టాప్ హీరోయిన్ గా మారడం ఖాయం అని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.  అనిల్ సినిమా తరువాత అతడు, ఖలేజా వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తోనూ, పరశురామ్ తోనూ సినిమాలు చేసే అవకాశం ఉంది.  ఈ ఇద్దరితో చేసిన తరువాత మహేష్... రాజమౌళి కాంబినేషన్లో మూవీ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: