‘మహర్షి’ సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ చిన్న గ్యాప్ తీసుకుని   వెంటనే అనిల్ రావిపూడి మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఈమధ్యలో హాలిడే ట్రిప్ కోసం యుకె  వెళ్ళబోతున్నాడు. అయితే ఇంకా అనిల్ రావిపూడి సినిమా మొదలు కాకుండానే ప్రస్తుతం ‘మహర్షి’ ప్రమోషన్ బిజీలో ఉంటూనే మహేష్ ఆడుతున్న డైరెక్టర్స్ మ్యూజికల్ చైర్స్ గేమ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘గీత గోవిందం’ దర్శకుడు పరశురాం చెప్పిన ఒక స్టోరీ లైన్ విని ఆ స్టోరీని పూర్తి కథగా డెవలప్ చేసుకుని రమ్మని మహేష్ చెప్పినట్లుగా వార్తలు ఇప్పటికే వచ్చాయి. అంతేకాదు లేటెస్ట్ గా మహేష్ ‘కబీర్ సింగ్’ విడుదలైన తరువాత వెంటనే తనను కలవవలసిందిగా దర్శకుడు సందీప్ రెడ్డికి మెసేజ్ పంపినట్లు టాక్. 

దీనితో సందీప్ రెడ్డి కూడ తన తదుపరి మూవీ మహేష్ తో ఉంటుందని కళలు కన్తున్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ ను ఇలాంటి కలలలోనే కొనసాగించి సుమారు ఒక సంవత్సరం పాటు తన చుట్టూ తిప్పుకుని చివరకు మహేష్ హ్యాండ్ ఇచ్చిన నేపధ్యంలో ప్రస్తుతం మహేష్ వీరిద్దరిలో ఎవరికైనా చివరకు ఓకె చెపుతాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం మహేష్ కు కొనసాగుతున్న మ్యానియాతో అతడితో సినిమాలు తీయడానికి చాలామంది క్యూ కడుతున్నా ఇలా అందరికీ ఆశ కల్పించి చిట్టచివరకు హ్యాండ్ ఇస్తే భవిష్యత్ లో మహేష్ కు కథ చెప్పే దర్శకులు కూడ ఉండరు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు ‘మహర్షి’ టాక్ బాగున్నా బయ్యర్లు కలక్షన్స్ విషయంలో సంతృప్తికరంగా లేని పరిస్థుతులలో ప్రస్తుతం మహేష్ ఆడుతున్న ఈ మ్యూజికల్ చైర్స్ అతడి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: