మహేష్ కెరియర్ కు సంబంధించి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ అంటే మహేష్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానమే ఇప్పుడు అల్లు అరవింద్ పరుశు రామ్ ల వ్యూహాలకు చెక్ పెడుతోందా అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 

వాస్తానికి తాను చేసే సినిమాలలో దూకుడు పెంచిన మహేష్ ప్రస్తుతం తాను నటిస్తున్న అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే తన 27వ సినిమాకు సంబంధించిన ఆలోచనలు మొదలు పెట్టేసాడు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ దూతగా వచ్చిన పరుశు రామ్ చెప్పిన కథ లైన్ నచ్చడంతో మహేష్ పరుశు రామ్ ల మూవీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మొదట్లో మొదలవుతుంది అన్న లీకులు వచ్చాయి. 

అయితే అనూహ్యంగా ఇప్పుడు కొరటాల శివ రంగంలోకి దిగడంతో అరవింద్ పరుశు రామ్ ప్లాన్స్ కు చెక్ పడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి స్థాపించిన యువ సుధా ఆర్ట్స్ బేనర్లో మహేష్ తన తదుపరి మూవీ చేయబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం కొరటాల చిరంజీవితో తీయవలసిన మూవీ ఇంకా కనీసం ప్రారంభం కూడా కాని నేపధ్యంలో కొరటాల ఖాళీ అయ్యేవరకు మహేష్ వేచి ఉంటాడా లేదంటే అరవింద్ పరుశు రామ్ ల మూవీ ప్రాజెక్ట్ కు కోరతాలను కూడ నిర్మాతగా మార్చి అరవింద్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మహేష్ లేటెస్ట్ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం అవ్వకుండానే అప్పుడే మహేష్ నటించే 27వ సినిమా గురించి ఊహాగానాలు మొదలు కావడం మహేష్ స్థామినాకు నిదర్శనం అని అంటున్నారు..    



మరింత సమాచారం తెలుసుకోండి: