మహేష్ భార్యగా మాత్రమే కాకుండా నమ్రత బిజినెస్ ఉమెన్ గా కూడ రాణిస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న నమ్రత త్వరలోనే విజయవాడ విశాఖపట్నంలలో కూడ భారీ మల్టీ ప్లెక్స్ ల నిర్మాణానికి నమ్రత పదకాలు రచిస్తోంది. 

ఒకవైపు మహేష్ బ్రాండ్ అండార్స్ మెంట్లు వ్యవహారాలను చూసుకుంటూ మరొకవైపు మహేష్ బాబు పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి ప్రస్తుతం అడవి శేషు హీరోగా ‘మేజర్’ అనే సినిమాను జీఎంబీ బ్యానర్ లో నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈమూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా నిర్మాణ పనులు జరుగుతూ ఉండగానే నమ్రత విజయ్ దేవరకొండతో మరొక మూవీని తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈ మూవీ ప్రాజెక్ట్ కు సరిపోయే మంచి కథ కోసం అదేవిధంగా ఆ కథను బాగా తీయగల దర్శకుడు కోసం నమ్రత అన్వేషణ కొనసాగిస్తున్నట్లు టాక్. ‘మహర్షి’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ అతిధిగా రాకముందే నమ్రత విజయ్ ల మధ్య ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రాధమీక చర్చలు జరిగినట్లు సమాచారం. దీనితో నమ్రతకు కూడ విజయ్ దేవరకొండ మ్యానియా పట్టుకుంది అంటూ ఇండస్ట్రీలో సెటైర్లు పేలుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: