దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంత అంటారు..ఈ సామెత హీరోయిన్ల విషయంలో చక్కగా సూట్ అవుతుంది. మొఖంలో కాస్త గ్లామర్... కాస్త క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు వెనకేసుకొని లైఫ్ సెటిల్ చేసుకుంటారు. కన్నడ కస్తూరి రష్మిక మందన్న కూడా ఇప్పుడు ఇదే రూట్లో ఉంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుని వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళుతోంది.
ప్రస్తుతం మహేష్బాబు - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా చేస్తోంది. తాజాగా తమిళంలో విజయ్ 64 వ ప్రాజెక్ట్లో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రాశి ఖన్నా మరో హీరోయిన్ గా నటిస్తుండగా..లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా టాప్ హీరోలతో నటిస్తుండడంతో రష్మిక రేటు కూడా పెంచేసినట్టు తెలుస్తోంది.
నిన్నమొన్నటి వరకు రూ.50 లక్షలకు కాస్త అటూ ఇటూగా డిమాండ్ చేస్తే అమ్మడు కోటి రూపాయలు కావాలని కూర్చొందట. ఇటు అఖిల్ 4వ ప్రాజెక్టులోనూ రష్మిక పేరు వినిపిస్తోంది. అటు సీనియర్ల నుంచి ఇటు జూనియర్ హీరోల వరకు అందరూ ఆమే కావాలని డిమాండ్ చేస్తుండడంతో ఇప్పుడు ఆమె కొండెక్కి కూర్చొంది.