స‌మంత లీడ్ రోల్ చేసిన ఓ బేబీ సినిమా రెండు రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు స‌మంత న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టాప్ నిర్మాత సురేష్‌బాబు అండ‌దండ‌ల‌తో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డంతో వ‌సూళ్లు కూడా ఆశాజ‌న‌కంగానే ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫ‌స్ట్ డే రూ 1.38 కోట్ల షేర్ వచ్చింది. రెండో రోజు వ‌సూళ్ల‌తో రూ. 2 కోట్ల షేర్ క్రాస్ చేసింది. పాజిటివ్ టాక్ రావ‌డంతో ఫ‌స్ట్ వీకెండ్‌కే రూ.3 కోట్ల షేర్ దాటేస్తుంద‌ని... ఆదివారం ఏ సెంట‌ర్ల‌తో పాటు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో మంచిగా టిక్కెట్లు బుక్ అయ్యాయ‌ని తెలుస్తోంది.


ఓవ‌రాల్‌గా ఫైన‌ల్ ర‌న్ అయ్యే స‌రికి రూ.8 కోట్ల షేర్ వ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. దర్శకురాలు నందినీరెడ్డి, రచయిత లక్ష్మీ భూపాల్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చారు. ఇదిలా ఉంటే ఓ బేబీ ఎఫెక్ట్‌తో బ్రోచేవారెవరురా సినిమాకు వసూళ్లు తగ్గాయి. వారం రోజుల పాటు బేబీ హవాకు బ్రేకులు ప‌డేలా లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: