ప్రభాస్ సాహో మూవీ ట్రైలర్ ఈరోజు రిలీజ్ కాబోతున్నది. ముంబైలో ఈ భారీ ఎత్తున ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ముంబైలోనే ఈ ఈవెంట్ ను ప్లాన్ చేయడానికి ఓ ప్రత్యేకమైన రీజన్ ఉన్నది. అదేమంటే.. బాహుబలి తరువాత ప్రభాస్ ఇండియా హీరో అయిపోయాడు. ఇండియా వైడ్ గా ప్రభాస్ కు మార్కెట్ ఉన్నది. బాలీవుడ్ లో ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్ పెరిగింది. పైగా సినిమా హిట్టైంది అంటే బాలీవుడ్ నుంచి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అంతర్జాతీయంగా కూడా హిందీ సినిమాలకు క్రేజ్ ఉన్నది.
సో, క్రేజ్ ఉన్నది కాబట్టి ఈ సినిమా వివిధ దేశాల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ, తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. అయితే, బయతదేశాల్లో హిందీ సినిమాలనే ఎక్కువ చూస్తారు. అందుకే హిందీలో ఎక్కువగా ప్రమోషన్ చేయాలని చూస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఓపెనింగ్ కార్యక్రమానికి యూనిట్ తో పాటు ఎవరెవరు వస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
ప్రభాస్ ను ఇండియన్ యాక్షన్ హీరోగా నిలబెట్టే సినిమా అవుతుందని యూనిట్ చెప్తోంది. సినిమా ఎలా ఉంటుంది అన్నది ఈరోజు రిలీజ్ చేయబోయే ట్రైలర్ ను బట్టి ఓ అంచనా వెయ్యొచ్చు. ఇప్పటికే వచ్చిన టీజర్ లు ఆకట్టుకున్నాయి. రెండు సింగిల్స్ కూడా బాగున్నాయని టాక్ వస్తోంది. కాకపోతే, హిందీ సాంగ్ ను తెలుగులో డబ్బింగ్ చేసినట్టుగా ఉన్నది.
ఈరోజు సాయంత్రం 5 వంటలకు ట్రైలర్ రిలీజ్ కాబోతున్నది. ప్రభాస్ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రైలర్ ఫీవర్ అప్పుడే మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ చూపించని విధంగా యాక్షన్ సన్నివేశాలను చూపించబోతున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు దర్శక నిర్మాతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఉంటుందా తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.